యాప్నగరం

వీరూ వర్సెస్ ప్రీతి జింతా.. మాటల యుద్ధం!

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు అన్నీ తానై వ్యవహరిస్తోన్న వీరేంద్ర సెహ్వాగ్, ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా మధ్య మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 11 May 2018, 1:34 pm
Samayam Telugu Sehawag preity.
రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గతేడాది పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్ ఈసారి మెరుగైన ఆటతీరు కనబర్చడానికి ముఖ్య కారణం వీరేంద్ర సెహ్వాగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 158 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

రాజస్థాన్‌పై అశ్విన్ మూడోస్థానంలో బ్యాటింగ్ దిగాడు. కానీ ఎదుర్కొన్న రెండో బంతికే డకౌటై నిరాశపరిచాడు. అశ్విన్ టాప్ఆర్డర్‌లో ఆడటంపై వీరూ, ప్రీతి జింతా మధ్య మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. కరుణ్ నాయర్, మనోజ్ తివారీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను కాదని అశ్విన్‌ను వన్‌డౌన్‌లో పంపడం ప్రీతీకి రుచించలేదని సమాచారం.

దీంతో జట్టు ఓడగానే.. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లక ముందే వీరూ దగ్గరకు వచ్చిన ప్రీతి తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రీతి మాటలతో కలత చెందిన సెహ్వాగ్.. ఆమె క్రికెట్ నిర్ణయాల్లో కలగజేసుకోవద్దని ఫ్రాంచైజీ సహ యజమానులకు సూచించాడని తెలుస్తోంది. ఒకనొక దశలో జట్టుతో ఉన్న ఐదేళ్ల అనుబంధాన్ని తెంచుకునే దిశగానూ వీరూ ఆలోచించినట్టు సమాచారం. ఈ వివాదం విషయంలో పంజాబ్ ఫ్రాంచైజీ తరఫున స్పందించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.