కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో తమ బ్యాట్స్మెన్ ఆడిన తీరుపై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 142 రన్స్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే జానీ బెయిర్స్టోను ప్యాట్ కమిన్స్ అద్భుత బంతితో ఔట్ చేశాడు.
రెండో వికెట్కు మనీషా పాండేతో కలిసి 35 రన్స్ జోడించిన వార్నర్.. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. మనీష్ పాండే 38 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ.. వార్నర్తోపాటు సాహా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సాహా.. 31 బంతుల్లో 30 పరుగులు చేయగా.. తర్వాత వచ్చిన నబీ 8 బంతుల్లో 11 రన్స్ చేశాడు.
మిడిల్ ఓవర్లలో సన్రైజర్స్ ఆడిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వార్నర్.. కీలక సమయంలో తన వికెట్ను పారేసుకున్నానని.. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. ‘గేర్ మార్చి దూకుడు పెంచాల్సిన తరుణంలో.. నేను పేలవంగా ఆడి వికెట్ పారేసుకున్నాను. ఓటమికి ఎవర్నీ నిందించను. సరిగా బ్యాటింగ్ చేయనందుకు, తేలిగ్గా వికెట్ పారేసుకున్నందుకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను’’ అని సన్రైజర్స్ ఓటమి అనంతరం వార్నర్ మీడియాకు తెలిపాడు.
‘‘మేం ఇంకొంచెం బాగా ఆడాల్సింది. మధ్య ఓవర్లలో నేను ఔటైన తర్వాత 20 పరుగులు రావడానికి 4-5 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. మిడిల్ ఓవర్లలో బౌలర్లపై మరింత ఒత్తిడి తెచ్చి.. మరిన్ని బౌండరీలు బాదాలి’’ అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. సన్రైజర్స్ బ్యాటింగ్లో 35-36 డాట్ బాల్స్ ఉన్నాయన్న వార్నర్.. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. టీ20 క్రికెట్లో డాట్ బాల్స్ ఆమోద యోగ్యం కాదన్నాడు.
మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన ఢిల్లీ ఉత్సాహంతో ఉంది. మూడో మ్యాచ్కు ముందు తమ ఆలోచనా విధానం మారాలని వార్నర్ అభిప్రాయడ్డాడు. భారత్లోని మైదానాలతో పోలిస్తే.. బౌండరీలు పెద్దగా ఉన్నాయని.. ఫోర్లు, సిక్సర్లు ఎలా బాదాలనే విషయమై వర్కౌట్ చేయాలని వార్నర్ తెలిపాడు.
రెండో వికెట్కు మనీషా పాండేతో కలిసి 35 రన్స్ జోడించిన వార్నర్.. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. మనీష్ పాండే 38 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ.. వార్నర్తోపాటు సాహా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సాహా.. 31 బంతుల్లో 30 పరుగులు చేయగా.. తర్వాత వచ్చిన నబీ 8 బంతుల్లో 11 రన్స్ చేశాడు.
మిడిల్ ఓవర్లలో సన్రైజర్స్ ఆడిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన వార్నర్.. కీలక సమయంలో తన వికెట్ను పారేసుకున్నానని.. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పాడు. ‘గేర్ మార్చి దూకుడు పెంచాల్సిన తరుణంలో.. నేను పేలవంగా ఆడి వికెట్ పారేసుకున్నాను. ఓటమికి ఎవర్నీ నిందించను. సరిగా బ్యాటింగ్ చేయనందుకు, తేలిగ్గా వికెట్ పారేసుకున్నందుకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను’’ అని సన్రైజర్స్ ఓటమి అనంతరం వార్నర్ మీడియాకు తెలిపాడు.
‘‘మేం ఇంకొంచెం బాగా ఆడాల్సింది. మధ్య ఓవర్లలో నేను ఔటైన తర్వాత 20 పరుగులు రావడానికి 4-5 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. మిడిల్ ఓవర్లలో బౌలర్లపై మరింత ఒత్తిడి తెచ్చి.. మరిన్ని బౌండరీలు బాదాలి’’ అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. సన్రైజర్స్ బ్యాటింగ్లో 35-36 డాట్ బాల్స్ ఉన్నాయన్న వార్నర్.. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. టీ20 క్రికెట్లో డాట్ బాల్స్ ఆమోద యోగ్యం కాదన్నాడు.
మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన ఢిల్లీ ఉత్సాహంతో ఉంది. మూడో మ్యాచ్కు ముందు తమ ఆలోచనా విధానం మారాలని వార్నర్ అభిప్రాయడ్డాడు. భారత్లోని మైదానాలతో పోలిస్తే.. బౌండరీలు పెద్దగా ఉన్నాయని.. ఫోర్లు, సిక్సర్లు ఎలా బాదాలనే విషయమై వర్కౌట్ చేయాలని వార్నర్ తెలిపాడు.