యాప్నగరం

Hanuma Vihari: రూ. 2కోట్లు పలికిన తెలుగు క్రికెటర్ విహారి

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన హనుమ విహారి.. తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం బాదడంతో పాటు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.

Samayam Telugu 18 Dec 2018, 4:02 pm
ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలో తెలుగు క్రికెటర్ హనుమ విహారి పంట పండింది. జైపూర్ వేదికగా ఈరోజు జరుగుతున్న వేలంలో రూ. 50 లక్షలు కనీస ధరతో వేలంలోకి వచ్చిన హనుమ విహారి ఏకంగా రూ. 2కోట్లకి అమ్ముడుపోయాడు. ముంబయి ఇండియన్స్‌తో ఆఖరి వరకూ పోటీపడిన ఢిల్లీ క్యాపిటల్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) ఫ్రాంఛైజీ ఎట్టకేలకి ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ని దక్కించుకుంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున హనుమ విహారి ఐపీఎల్ ఆడాడు.
Samayam Telugu ..


ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన హనుమ విహారి.. తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకం బాదడంతో పాటు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా ఈ రోజు ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టులోనూ బ్యాట్, బంతితో రాణించిన ఈ తెలుగు క్రికెటర్.. ఢిల్లీ తరఫున వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టనున్నాడు. ఫస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి సమానమైన సగటు ఉండటంతో.. అతడ్ని దక్కించుకునేందుకు క్రికెటర్లు పోటీపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.