యాప్నగరం

ఢిల్లీ, ఆర్‌సీబీ, ముంబై.. ప్లే ఆఫ్ చేరాలంటే??

ఐపీఎల్ 2018లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో నిలిచిన మూడు జట్లు కూడా ప్లే ఆఫ్ చేరేందుకు ద్వారాలు పూర్తిగా మూసుకుపోలేదు.

Samayam Telugu 1 May 2018, 6:05 pm
ఐపీఎల్ పదకొండో సీజన్ అర్ధ భాగం ముగిసింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టాప్ ప్లేస్ దక్కించుకోగా.. ఢిల్లీ డేర్ డెవిల్స్ అట్టడుగున నిలిచింది. బెంగళూరు, ముంబై జట్లు చివరి నుంచి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ప్లే ఆఫ్ దశకు చేరుకోవడానికి చెన్నై, హైదరాబాద్, పంజాబ్ జట్లకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. కానీ చివరి స్థానంలో ఉన్న మూడు జట్లకు కూడా అవకాశాలు మూసుకుపోలేదు.
Samayam Telugu playoffs


ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ దశకు చేరాలంటే ఇక మీదట ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపొందాలి. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే.. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. ముంబై, బెంగళూరు జట్లు కూడా ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటిలో నెగ్గాల్సిన పరిస్థితి.

మంగళవారం రాత్రి ఆర్‌సీబీ, ముంబై జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. తర్వాత జరగబోయే ఆరు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో ఓడినా ఫర్వాలేదు. కాబట్టి ప్లే ఆఫ్ రేసులో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.