యాప్నగరం

RR vs KXIP: అచ్చం ఇలాగే.. పంజాబ్ గెలిచి ఉండుంటే..? చేజారిన లక్కీ ఛాన్స్!

Rajasthan Royalsతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓడటంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచి ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది.

Samayam Telugu 31 Oct 2020, 12:09 pm
ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో కుదేలైన పంజాబ్.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌‌ల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. తనను ఓడించిన ప్రతి జట్టుపై బదులు తీర్చుకుంటూ.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. కానీ పంజాబ్ వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేకులేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 185 పరుగులు చేయగా.. రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Samayam Telugu rr vs kxip


ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే.. ఆ జట్టు ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఎంతో మెరుగయ్యేవి. ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు చేరేవి. చివరి మ్యాచ్‌లోనూ గెలిస్తే.. 16 పాయింట్లతో మిగతా సమీకరణలతో సంబంధం లేకుండా టాప్-4లోనే కాదు కుదిరితే టాప్-3లో ఒకటిగా నిలిచేది. అబుదాబీలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బదులు పంజాబ్ 17.3 ఓవర్లలో గెలిచి ఉండుంటే.. పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకునే అవకాశం ఉండేది. కానీ ఓడిపోవడంతో.. ప్లేఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆరంభంలోనే మన్‌దీప్ సింగ్ వికెట్ కోల్పోయింది. కానీ రాహుల్- క్రిస్ గేల్ జోడి రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. గేల్ 63 బంతుల్లోనే 99 రన్స్‌తో సత్తా చాటగా.. రాహుల్ 41 బంతుల్లో 46 రన్స్ చేశాడు. చివర్లో భారీ హిట్టింగ్ చేయాల్సిన స్థితిలో మ్యాక్స్‌వెల్ ఆరు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్, మ్యాక్సీ ఇంకాస్త వేగంగా ఆడి ఉండుంటే.. పంజాబ్ 200కిపైగా పరుగులు చేసి ఉండేది. కానీ 185 రన్స్ మాత్రమే చేసి 17.3 ఓవర్లలోనే ఓడింది.. ఫలితంగా ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా -0.05 నుంచి -0.15కి పడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.