యాప్నగరం

‘ఫైనల్లో సన్‌రైజర్స్ ఆడి ఉండుంటే.. కథ వేరేలా ఉండేది’

Delhi Capitals బదులు sunrisers Hyderabad ఐపీఎల్ ఫైనల్ చేరి ఉండుంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆరెంజ్ ఆర్మీ ఫైనల్ చేరి ఉండుంటే గట్టి పోటీ ఇచ్చేదన్నారు.

Samayam Telugu 11 Nov 2020, 10:17 am
ఐపీఎల్ 2020 విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కంగ్రాట్స్ చెప్పింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినందుకు ముంబైని అభినందించిన సన్‌రైజర్స్.. సీజన్ మొత్తం బాగా ఆడారంటూ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రశంసలు గుప్పించింది. దీనికి ముంబై ఇండియన్స్ థ్యాంక్స్ చెప్పింది. ఈ సీజన్లో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓడిన సంగతి తెలిసిందే.
Samayam Telugu srh
Image: IPL/BCCI


ముంబైను అభినందిస్తూ.. సన్‌రైజర్స్ చేసిన ట్వీట్లు పట్ల ఫ్యాన్స్ స్పందించారు. మనం ఫైనల్స్‌లో ఉంటే కథ వేరేలా ఉండేదంటూ అభిమానులు బదులిచ్చారు. ఫైనల్లో ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ పోటీ ఇవ్వలేకపోయిందని.. అదే మన టీం ఫైనల్ చేరి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఢిల్లీ కారణంగా మ్యాచ్ వన్ సైడెడ్ అయ్యిందని.. అదే సన్‌రైజర్స్ అయితే గట్టి పోటీ ఇచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఆరెంజ్ ఆర్మీ రోహిత్ సేనకు చెమటలు పట్టించేదన్నారు.
ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ పది వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్ చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై చేతిలో ఈ సీజన్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.