యాప్నగరం

Ind vs Aus: భారత జట్టులో రోహిత్‌కు దక్కని చోటు.. గంగూలీ స్పందన

ఆస్ట్రేలియా పర్యటన కోసం మూడు ఫార్మాట్లకూ ప్రకటించిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు.

Samayam Telugu 3 Nov 2020, 11:19 am
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టులో రోహిత్ శర్మ పేరు లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. గాయం కారణంగానే రోహిత్‌ను పక్కనబెట్టామని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోహిత్‌ను ఎంపిక చేయకుండా ఉండటంలో తన పాత్రేమీ లేదని.. గాయం మరోసారి తిరగబెట్టే ప్రమాదం ఉండటంతోనే సెలక్టర్లు హిట్‌మ్యాన్‌ను పక్కనబెట్టి ఉంటారని కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు.
Samayam Telugu rohit


ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటన కంటే ముందు రోహిత్ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే.. సెలక్టర్లు మనసు అతణ్ని ఎంపిక చేసే విషయమై పునరాలోచిస్తారని దాదా తెలిపాడు. ఫిట్‌గా ఉంటే ఇషాంత్ శర్మ కూడా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడతాడని గంగూలీ వెల్లడించాడు.

రోహిత్, ఇషాంత్‌లను పర్యవేక్షిస్తున్నామని గంగూలీ తెలిపాడు. ఇషాంత్ పూర్తిగా టోర్నీ నుంచి వైదొలగలేదన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నాటికి రోహిత్ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నామన్నాడు.

గాయం కారణంగా రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయని సెలక్టర్లు.. వన్డేలు, టీ20ల్లో కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.