టీమిండియాలో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ మెత్తబడినట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ కారణాలతో రోహిత్ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో బోర్డు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక నవంబర్ 11న ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్న భారత జట్టుతోపాటు రోహిత్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ను ఆస్ట్రేలియా పర్యటనకు పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రోహిత్ జట్టుతో ఉండటమే సరైందని.. ఫిజియో నితిన్ పటేల్, ట్రైనర్ నిక్ వెబ్ అతణ్ని పర్యవేక్షిస్తారని సమాచారం.
అంతగా అవసరం అనుకుంటే.. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో రోహిత్కు విశ్రాంతి కల్పించి.. టీ20 సిరీస్లో ఆడించే అవకాశం ఉంది. టెస్టు సిరీస్ ప్రారంభానికల్లా అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తాడు. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ బారిన పడిన రోహిత్.. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని ఇటీవలే ప్రకటించాడు.
కాగా ఐపీఎల్ ఫైనల్ రోహిత్ శర్మకు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోచ్ రవిశాస్త్రి సలహాను కాదని రోహిత్ గత రెండు ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. కానీ బ్యాట్తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం, సింగిల్స్ను డబుల్స్గా మలచడం, ఫీల్డ్లో చురుగ్గా కదలడం లాంటివి చేసి రోహిత్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
‘ఐపీఎల్ మ్యాచ్, అంతర్జాతీయ మ్యాచ్ రెండూ వేర్వేరు. రెండింటికి ఫిట్నెస్ అవసరం వేర్వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ రోహిత్ రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లుగా కనిపించలేదు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అతడికి కీలకం. ఫైనల్లో అతడు మునుపటిలా ఆడితే ఏదైనా జరగొచ్చు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
రోహిత్ను ఆస్ట్రేలియా పర్యటనకు పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రోహిత్ జట్టుతో ఉండటమే సరైందని.. ఫిజియో నితిన్ పటేల్, ట్రైనర్ నిక్ వెబ్ అతణ్ని పర్యవేక్షిస్తారని సమాచారం.
అంతగా అవసరం అనుకుంటే.. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్లో రోహిత్కు విశ్రాంతి కల్పించి.. టీ20 సిరీస్లో ఆడించే అవకాశం ఉంది. టెస్టు సిరీస్ ప్రారంభానికల్లా అతడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తాడు. హ్యామ్స్ట్రింగ్ స్ట్రెయిన్ బారిన పడిన రోహిత్.. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని ఇటీవలే ప్రకటించాడు.
కాగా ఐపీఎల్ ఫైనల్ రోహిత్ శర్మకు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోచ్ రవిశాస్త్రి సలహాను కాదని రోహిత్ గత రెండు ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. కానీ బ్యాట్తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం, సింగిల్స్ను డబుల్స్గా మలచడం, ఫీల్డ్లో చురుగ్గా కదలడం లాంటివి చేసి రోహిత్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
‘ఐపీఎల్ మ్యాచ్, అంతర్జాతీయ మ్యాచ్ రెండూ వేర్వేరు. రెండింటికి ఫిట్నెస్ అవసరం వేర్వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ రోహిత్ రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడినప్పటికీ.. ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లుగా కనిపించలేదు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అతడికి కీలకం. ఫైనల్లో అతడు మునుపటిలా ఆడితే ఏదైనా జరగొచ్చు’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.