యాప్నగరం

India vs Australia: రోహిత్ శర్మను అందుకే పక్కనబెట్టాం.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు!

Ravi Shastri | భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను పక్కనబెట్టిన విషయమై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

Samayam Telugu 1 Nov 2020, 1:36 pm
ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను పక్కనబెట్టడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రోహిత్‌ను ఎంపిక చేయలేదని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం కోహ్లితో విబేధాలే కారణమని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ప్రకటించిన కాసేపటికే.. రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ అయోమయానికి లోనయ్యారు.
Samayam Telugu ravi_shashtri_rohit


గాయపడిన మయాంక్ అగర్వాల్‌ను ఆస్ట్రేలియా పర్యటనలో మూడు ఫార్మాట్లకూ ఎంపిక చేసిన సెలక్టర్లు... రోహిత్‌ను మాత్రం ఎందుకు పక్కనబెట్టారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రోహిత్‌ను పక్కనబెట్టిన విషయమై.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. బీసీసీఐ మెడికల్ టీం సమర్పించిన నివేదిక ఆధారంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రోహిత్ మరోసారి గాయపడే ప్రమాదం ఉందని మెడికల్ టీం రిపోర్ట్ ఇచ్చిందని అందుకే సెలక్టర్లు అతణ్నిఎంపిక చేయలేదని తెలిపారు.

ఈ వ్యవహారంలో తాము తలదూర్చలేదని రవిశాస్త్రి స్పష్టం చేశారు. సెలక్షన్ కమిటీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని కోచ్ తెలిపారు. రోహిత్ మరోసారి గాయపడే ప్రమాదం ఉందని మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన విషయం మాత్రమే తనకు తెలుసని శాస్త్రి వెల్లడించారు.

కాగా రోహిత్ శర్మ తిరిగి ఐపీఎల్ 2020లో ఆడతాడని ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన అనంతరం.. పోలార్డ్ మాట్లాడుతూ.. రోహిత్ త్వరలోనే తిరిగి ఆడే అవకాశం ఉందని తెలిపాడు. రోహిత్ గాయం నుంచి కోలుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలోనూ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.