రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది సమతూకంతో ఉందని హిట్టర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కోల్కతా నైట్రైడర్స్తో గత ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో సునీల్ నరైన్ 19 బంతుల్లోనే 50 పరుగులు చేయడంతో.. బెంగళూరు 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేపోయింది. అయితే.. గత కొన్ని సీజన్లతో పోలిస్తే.. ఈ ఏడాది బెంగళూరు జట్టు మంచి సమతూకంతో ఉందని.. తొలి మ్యాచ్లో కూడా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
‘క్రికెట్ విశ్లేషకులు గత కొన్ని సీజన్లుగా బెంగళూరు జట్టులో సమతూకం లోపించిందని చెప్తుండేవారు. మా జట్టు టైటిల్ గెలవలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని వారి అభిప్రాయం. ఇప్పుడు జట్టు బౌలింగ్ విభాగం మెరుగుపడింది. కోల్కతాతో మ్యాచ్లో ఓడిన తర్వాత కోచ్ డేనియల్ వెటోరి నన్ను పక్కకి పిలిచాడు. పరాజయంపై తొలుత నిరాశ వ్యక్తం చేసిన ఆయన.. జట్టులో చాలా సానుకూలాంశాలు కనిపించాయన్నాడు. జట్టు రిజర్వ్ బెంచ్ కూడా ఈ ఏడాది మునుపటి కంటే బలంగా ఉంది. తప్పకుండా.. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని ఏబీ డివిలియర్స్ ధీమా వ్యక్తం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో శుక్రవారం బెంగళూరు జట్టు తర్వాత మ్యాచ్ ఆడనుంది.
‘క్రికెట్ విశ్లేషకులు గత కొన్ని సీజన్లుగా బెంగళూరు జట్టులో సమతూకం లోపించిందని చెప్తుండేవారు. మా జట్టు టైటిల్ గెలవలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని వారి అభిప్రాయం. ఇప్పుడు జట్టు బౌలింగ్ విభాగం మెరుగుపడింది. కోల్కతాతో మ్యాచ్లో ఓడిన తర్వాత కోచ్ డేనియల్ వెటోరి నన్ను పక్కకి పిలిచాడు. పరాజయంపై తొలుత నిరాశ వ్యక్తం చేసిన ఆయన.. జట్టులో చాలా సానుకూలాంశాలు కనిపించాయన్నాడు. జట్టు రిజర్వ్ బెంచ్ కూడా ఈ ఏడాది మునుపటి కంటే బలంగా ఉంది. తప్పకుండా.. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని ఏబీ డివిలియర్స్ ధీమా వ్యక్తం చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో శుక్రవారం బెంగళూరు జట్టు తర్వాత మ్యాచ్ ఆడనుంది.