యాప్నగరం

అభిమానుల్ని మురిపించిన ధోనీ-జీవా ఆట..!

రెండేళ్ల తర్వాత భారీ అంచనాల మధ్య ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్‌ చేరింది. సగానికిపైగా కొత్త

Samayam Telugu 21 May 2018, 6:39 pm
రెండేళ్ల తర్వాత భారీ అంచనాల మధ్య ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్‌ చేరింది. సగానికిపైగా కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చినా.. వారిని చక్కగా సమన్వయం చేసుకుంటూ చెన్నైని పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి ధోనీ చేర్చిన తీరు అతని నాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది. ముఖ్యంగా.. ఆదివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో ధోనీ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్నే మార్చేశాయి. పంజాబ్‌ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ హర్భజన్, దీపక్ చాహర్‌లను క్రీజులోకి పంపి.. ఆఖర్లో తాను వచ్చి సిక్స్‌తో మ్యాచ్‌ని ముగించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
Samayam Telugu 7


మ్యాచ్ అనంతరం ఒకవైపు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుండగా.. మరోవైపు ధోనీ తన కూతురు జీవాతో కలిసి మైదానంలో సరదాగా కాసేపు ఆడుకున్నాడు. జీవా కూడా ధోనీ తలపై నుంచి క్యాప్ తీసి.. దానిపై ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లోగోని అతనికే చూపిస్తుండటం స్టేడియంలోని చెన్నై అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి 7 గంటలకి చెన్నై సూపర్ కింగ్స్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢీకొననుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.