యాప్నగరం

ఆ సిల్లీ రనౌట్.. మ్యాచ్‌ గమనాన్ని మార్చేసింది..!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో నితీశ్ రాణా పేలవంగా రనౌటవడంతోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ని చేజార్చుకోవాల్సి

Samayam Telugu 26 May 2018, 2:54 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో నితీశ్ రాణా పేలవంగా రనౌటవడంతోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ని చేజార్చుకోవాల్సి వచ్చిందని ఆ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. 175 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా జట్టు 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 87/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ.. ఈ దశలో లేని పరుగు కోసం ప్రయత్నించి నితీశ్ రాణా (22: 16 బంతుల్లో 1x4, 2x6) రనౌటవగా.. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప (2), దినేశ్ కార్తీక్ (8), ఆండ్రీ రసెల్ (3) క్రీజులో కుదురుకునేలోపే పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఒత్తిడికి గురైన కోల్‌కతా ఆఖరికి 160/9కే పరిమితమైంది. ఒకవేళ రాణా రనౌటవకుండా ఉండింటే.. తప్పకుండా మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచేదని కార్తీక్ వెల్లడించాడు.
Samayam Telugu 26rana


‘నితీశ్ రాణా రనౌట్ మ్యాచ్‌ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. అతను మరికొంతసేపు క్రీజులో ఉండింటే కోల్‌కతా గెలిచేది. కీలక సమయంలో.. పేలవంగా అతను రనౌటయ్యాడు. అనంతరం వచ్చిన రాబిన్ ఉతప్ప కూడా చెత్త షాట్ ఆడాడు. అంతకముందే రాణా ఔటైన నేపథ్యంలో ఉతప్ప రివర్స్ స్వీప్‌ కోసం ప్రయత్నించి బౌల్డవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని దినేశ్ కార్తీక్ పెదవి విరిచాడు. రషీద్ ఖాన్ వేసిన స్ట్రైయిట్ డెలివరీని రివర్స్ స్వీప్ ఆడేందుకు ఉతప్ప ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ని గీరాటేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.