యాప్నగరం

ఐపీఎల్ ఆరంభోత్సవంలో తమన్నా డ్యాన్స్..?

ఆరంభం బావుంటే సగం పని పూర్తయినట్లే.. ఈ సూత్రాన్నే గత పదేళ్లుగా ఐపీఎల్‌లో అవలంబిస్తున్నాం. ఆరంభోత్సవం ద్వారా యువతని

Samayam Telugu 28 Mar 2018, 4:10 pm
ఐపీఎల్ 2018 సీజన్ ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాంఖడే వేదికగా ఏప్రిల్ 7న సాయంత్రం ఈ ఆరంభోత్సవం జరగనుండగా.. అనంతరం రాత్రి 8 గంటలకి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ ఆరంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌, పరిణీతి చోప్రాతో పాటు తమన్నా కూడా డ్యాన్స్ చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆరంభ వేడుకల కోసం బోర్డు తొలుత రూ. 50 కోట్లు కేటాయించగా.. బీసీసీఐ పాలకుల కమిటీ రూ. 30 కోట్లు కోత విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఈ ఆరంభోత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.
Samayam Telugu ..


‘ఆరంభం బావుంటే సగం పని పూర్తయినట్లే.. ఈ సూత్రాన్నే గత పదేళ్లుగా ఐపీఎల్‌లో అవలంబిస్తున్నాం. ఆరంభోత్సవం ద్వారా యువతని ఆకర్షించగలిగితే.. టోర్నీ ఆదరణకి ఢోకా ఉండదు. అందుకే.. బాలీవుడ్ స్టార్స్‌తో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది ఎనిమిది వేదికల్లో ఆరంభోత్సవాల్ని నిర్వహించాం. కానీ.. ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. అందుకే.. ఈ ఏడాది ఒక్కచోట మాత్రమే నిర్వహించాలని నిర్ణయించాం. రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌, పరిణీతి చోప్రా,తమన్నా, ప్రభుదేవా వేదికపై డ్యాన్స్ చేయనున్నారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.