యాప్నగరం

చెత్త షాట్లతోనే మ్యాచ్ చేజారింది: రోహిత్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ఆటతీరుపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పెదవి

Samayam Telugu 25 Apr 2018, 6:30 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ఆటతీరుపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పెదవి విరిచాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 118 పరుగులకి ఆలౌటవగా.. అనూహ్యంగా తడబడిన ముంబయి జట్టు కేవలం 87 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (34: 38 బంతుల్లో 4x4), క్రునాల్ పాండ్య (24: 20 బంతుల్లో 4x4) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దీంతో.. టోర్నీలో నాలుగో ఓటమిని ముంబయి ఇండియన్స్ చవిచూడాల్సి వచ్చింది.
Samayam Telugu 3


‘119 పరుగుల లక్ష్యాన్ని మేము ఛేదించి ఉండాల్సింది. బౌలర్లు చాలా కష్టపడి తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని కట్టడి చేశారు. కానీ.. బ్యాట్స్‌మెన్ మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. పిచ్‌ స్పందిస్తున్న తీరుని గమనిస్తే ఆ లక్ష్యం కష్టమైందని మాకు తెలుసు. కానీ.. ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడి ఉండాల్సింది. హైదరాబాద్ బౌలర్లు లయ తప్పకుండా.. సరైన ప్రాంతంలో బంతులు విసిరారు. దీనికి తోడు జట్టులోని కొంత మంది బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడి వికెట్ చేజార్చుకున్నారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.