యాప్నగరం

శతకం బాదిన చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్

ఐపీఎల్ 2018 సీజన్‌లో రెండో శతకం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్‌తో పుణె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్

Samayam Telugu 20 Apr 2018, 10:08 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లో రెండో శతకం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్‌తో పుణె వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ (106 : 57 బంతుల్లో 9x4, 6x6) మెరుపు శతకం బాదేశాడు. దీంతో.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఐపీఎల్‌ కెరీర్‌లో వాట్సన్‌కి ఇది మూడో సెంచరీకాగా.. ఈ సీజన్‌లో క్రిస్‌గేల్ తర్వాత సెంచరీ బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు సెంచరీలు బాదిన వాట్సన్.. మూడో శతకాన్ని ఆ జట్టుపైనే సాధించడం విశేషం.
Samayam Telugu 10


ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ నుంచే వాట్సన్ దూకుడు కొనసాగించాడు. స్టువర్ట్ బిన్నీ వేసిన మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన వాట్సన్‌.. ఆ ఓవర్‌లోని ఐదో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్లిప్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి జారవిడిచాడు. తర్వాత ఓవర్‌లోనూ వాట్సన్ క్యాచ్‌ని మరోసారి త్రిపాఠి జారవిడచడంతో ఇక వాట్సన్‌ భారీ షాట్లతో చెలరేగిపోయాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా వరుస బౌండరీలు బాదేశాడు. ఈ ఓపెనర్ జోరుకి అడ్డుకట్ట వేసేందుకు రాజస్థాన్ కెప్టెన్ రహానె.. వరుసగా బౌలర్లని మార్చిన ప్రయోజనం లేకపోయింది. 51 బంతుల్లో సెంచరీ మార్క్‌ని అందుకున్న వాట్సన్.. ఇన్నింగ్స్‌లో ఒక బంతి మిగిలి ఉన్న దశలో ఔటయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.