యాప్నగరం

ఐపీఎల్ టోర్నీలో ఈరోజే బిగ్ ఫైట్..!

ఐపీఎల్ 2018 సీజన్‌లోనే అత్యంత రసవత్తరమైన మ్యాచ్‌కి ఈరోజు రాత్రి 8 గంటలకి వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. హిట్లర్లతో

Samayam Telugu 17 Apr 2018, 5:02 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లోనే అత్యంత రసవత్తరమైన మ్యాచ్‌కి ఈరోజు రాత్రి 8 గంటలకి వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. హిట్లర్లతో కళకళలాడుతున్న ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టోర్నీలో తొలిసారి ఢీకొంటున్నాయి. గత ఏడాది విజేతగా నిలిచిన ముంబయి జట్టు.. ఈ ఏడాది ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలవగా.. బెంగళూరు జట్టు ఓ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టినా.. గత మ్యాచ్‌లో అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో చేతిలో ఓడి ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది.
Samayam Telugu TOSS


బెంగళూరు ఓపెనర్లు మెక్‌కలమ్, డికాక్ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినా.. క్రీజులో నిలిస్తే ఒంటిచేత్తో మ్యాచ్‌ని మలుపుతిప్పగలరు. వారితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, హిట్టర్ ఏబీ డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకి కలిసొచ్చే అంశం. గత సీజన్లతో పోలిస్తే.. బెంగళూరు బౌలింగ్ విభాగం కూడా ఈ ఏడాది మెరుగ్గా ఉంది. మరోవైపు ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హిట్టర్లు పొలార్డ్, హార్దిక్ పాండ్యపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురూ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగైన స్కోరు చేయలేదు. రెండు జట్లలోనూ బలమైన హిట్టర్లు ఉండటంతో మ్యాచ్‌లో ఎక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.