యాప్నగరం

MI IPL 2019: చెన్నైతో పంతం.. శరణ్‌కి రూ.3.4 కోట్లు వెచ్చించిన ముంబయి

వాస్తవానికి టీమిండియాకి దూరంగా ఉంటున్న బరిందర్ శరణ్ గత ఏడాదికాలంగా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. దీంతో.. రూ. 50 లక్షల కనీస ధరతో ఈ ఫాస్ట్ బౌలర్ వేలంలోకి వచ్చాడు. కానీ..?

Samayam Telugu 18 Dec 2018, 7:16 pm
ఐపీఎల్‌‌ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలో ఫాస్ట్ బౌలర్ బరిందర్ శరణ్ కోసం ఆసక్తికరమైన పోటీ నడిచింది. 2018 సీజన్‌లో రూ. 2.2 కోట్లకి ఈ పేసర్‌ని కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయగా.. పేలవ బౌలింగ్ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో.. తాజాగా అతడ్ని పంజాబ్ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టగా.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీలు పోటీపడటంతో అతని ధర అమాంతం పెరిగిపోయింది. ఆఖరి వరకూ రేసులో నిలిచిన ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ. 3.4 కోట్లకి దక్కించుకుంది. అయితే.. అతని ధర అంతలా పెరగడానికి కారణం చెన్నై సూపర్ కింగ్స్ రేసులో నిలవడమే..!
Samayam Telugu not


వాస్తవానికి టీమిండియాకి దూరంగా ఉంటున్న బరిందర్ శరణ్ గత ఏడాదికాలంగా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. దీంతో.. రూ. 50 లక్షల కనీస ధరతో ఈ ఫాస్ట్ బౌలర్ వేలంలోకి వచ్చాడు. దీంతో.. తొలుత అతడి కోసం ముంబయి ప్రయత్నించగా.. అనూహ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నుంచి పోటీ ఎదురైంది. ఇలా ఈ రెండు ఫ్రాంఛైజీలు.. 1.10 లక్షలు వరకూ పోటీపడగా.. మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ అందుకుంది. దీంతో.. పంజాబ్ రేసు నుంచి నిష్క్రమించగా.. పోటీ చెన్నై, ముంబయి మధ్య నడించింది. రూ. 3.3 కోట్ల వరకూ పోటీపడిన చెన్నై ఆ తర్వాత తప్పుకోగా.. ఆఖరిగా ముంబయికే ఈ పేసర్‌ దక్కాడు. కానీ.. ఎక్కువ ధర వెచ్చించామనే రీతిలో ముంబయి ఫ్రాంఛైజీ యజమానులు నిరాశ వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.