ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు స్కోరు 46 పరుగుల వద్ద డుప్లెసిస్ (13 బంతుల్లో 25) ఔటవగా.. రుతురాజ్ గైక్వాడ్ (65 నాటౌట్), అంబటి రాయుడు (39) రెండో వికెట్కు 67 పరుగులు జోడించారు.
కాగా రుతురాజ్-రాయుడు బ్యాటింగ్ చేస్తుండగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా.. రెండో స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తర్వాత బ్యాటింగ్కు రావాల్సిన అంబటి రాయుడు కనిపించకుండా పోయాడు. రెండున్నర నిమిషాలు దాటేలోపు ఆటగాళ్లంతా వచ్చేయగా.. రాయుడు మాత్రం మైదానంలో కనిపించకపోవడంతో.. కోహ్లి అసహనంగా కనిపించాడు.
‘దీంతో ఓ ఆటగాడు మిస్సయ్యాడు. అంబటి రాయుడు కనిపించడం లేదు. అతడు మైదానాన్ని వదిలి వెళ్లాడు. బహుశా బాత్రూమ్ బ్రేక్ తీసుకొని ఉంటాడు’ అని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. స్టమక్ అప్సెట్ అయ్యి ఉంటుంది.. కానీ అతడు ఇంకా రావడం లేదంటూ.. కామెంట్ చేశారు.
కాసేపటి తర్వాత రాయుడు పరిగెత్తుకుంటూ పిచ్ మీదకు వచ్చాడు. వచ్చీ రాగానే బెంగళూరు వికెట్ కీపర్ ఏబీ డివియర్స్కు సారీ చెప్పినట్లుగా రాయుడు మాట్లాడుతూ కనిపించాడు. తర్వాత వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. పాపం అంబటి రాయుడు.. అతడికి ఏమైందో అందరికీ తెలిసిపోయిందంటూ కామెంటేంటర్లు సరదాగా వ్యాఖ్యానించారు.
రాయుడు రావడంతో.. రెండు నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. కానీ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మూడో బంతికే చాహల్ బౌలింగ్లో రాయుడు ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోనీ.. రుతురాజ్తో కలిసి మ్యాచ్ను ముగించాడు.
కాగా రుతురాజ్-రాయుడు బ్యాటింగ్ చేస్తుండగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా.. రెండో స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తర్వాత బ్యాటింగ్కు రావాల్సిన అంబటి రాయుడు కనిపించకుండా పోయాడు. రెండున్నర నిమిషాలు దాటేలోపు ఆటగాళ్లంతా వచ్చేయగా.. రాయుడు మాత్రం మైదానంలో కనిపించకపోవడంతో.. కోహ్లి అసహనంగా కనిపించాడు.
‘దీంతో ఓ ఆటగాడు మిస్సయ్యాడు. అంబటి రాయుడు కనిపించడం లేదు. అతడు మైదానాన్ని వదిలి వెళ్లాడు. బహుశా బాత్రూమ్ బ్రేక్ తీసుకొని ఉంటాడు’ అని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. స్టమక్ అప్సెట్ అయ్యి ఉంటుంది.. కానీ అతడు ఇంకా రావడం లేదంటూ.. కామెంట్ చేశారు.
కాసేపటి తర్వాత రాయుడు పరిగెత్తుకుంటూ పిచ్ మీదకు వచ్చాడు. వచ్చీ రాగానే బెంగళూరు వికెట్ కీపర్ ఏబీ డివియర్స్కు సారీ చెప్పినట్లుగా రాయుడు మాట్లాడుతూ కనిపించాడు. తర్వాత వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. పాపం అంబటి రాయుడు.. అతడికి ఏమైందో అందరికీ తెలిసిపోయిందంటూ కామెంటేంటర్లు సరదాగా వ్యాఖ్యానించారు.
రాయుడు రావడంతో.. రెండు నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. కానీ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మూడో బంతికే చాహల్ బౌలింగ్లో రాయుడు ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధోనీ.. రుతురాజ్తో కలిసి మ్యాచ్ను ముగించాడు.