ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకి మళ్లీ గెలుపు రుచి చూసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో విరాట్ కోహ్లీ (50: 43 బంతుల్లో 1x4, 1x6) అర్ధశతకం బాదడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (65 నాటౌట్: 51 బంతుల్లో 4x4, 3x6) అజేయ హాఫ్ సెంచరీ బాదడంతో లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే చెన్నై సూపర్ కింగ్స్ 150/2తో ఛేదించేసింది. తాజా సీజన్లో 12వ మ్యాచ్ ఆడిన చెన్నైకి ఇది నాలుగో గెలుపుకాగా.. 11వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది నాలుగో ఓటమి.
146 పరుగుల లక్ష్యఛేదనని చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఛేదనని ప్రారంభించిన డుప్లెసిస్ (25: 13 బంతుల్లో 2x4, 2x6) భారీ షాట్లతో చెలరేగిపోయాడు. పవర్ ప్లేలోనే రుతురాజ్ కూడా కాస్త బ్యాట్ ఝళిపించడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 46/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే.. ఆరో ఓవర్ తొలి బంతికే డుప్లెసిస్ ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (39: 27 బంతుల్లో 3x4, 2x6) స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకుని రుతురాజ్పై ఒత్తిడి తగ్గించాడు. కానీ.. జట్టు స్కోరు 113 వద్ద చాహల్ బౌలింగ్లో బ్యాట్ని అడ్డంగా ఊపేసి రాయుడు బౌల్డయ్యాడు. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోనీ (19 నాటౌట్: 21 బంతుల్లో 3x4).. చివర్లో రుతురాజ్కి చక్కటి సహకారం అందించగా.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లోనే సిక్స్తో రుతురాజ్ మ్యాచ్ని ముగించాడు.
మ్యాచ్లో అంతకముందు టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. ఇన్నింగ్స్ ప్రారంభించిన పడిక్కల్ (22: 21 బంతుల్లో 2x4, 1x6), అరోన్ ఫించ్ (15: 11 బంతుల్లో 3x4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైపోగా.. అనంతరం వచ్చిన ఏబీ డివిలియర్స్తో కలిసి విరాట్ కోహ్లీ సమయోచితంగా ఆడాడు. స్పిన్నర్లు ఊరిస్తూ బంతుల్ని విసిరినా.. ఓపికగా సింగిల్, డబుల్స్తో సరిపెట్టిన ఈ జోడీ.. స్కోరు బోర్డు 100 దాటే వరకూ ఎలాంటి సాహసోపేత షాట్లు ఆడలేదు. అయితే.. స్లాగ్ ఓవర్లలో గేర్ మార్చే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఏబీ డివిలియర్స్ (39: 36 బంతుల్లో 4x4) ఔటవగా.. తాజా సీజన్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ 19 ఓవర్లో భారీ షాట్కి ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. ఆఖర్లో మొయిన్ అలీ (1), క్రిస్ మోరీస్ (2), గుర్కీరత్ (2 నాటౌట్) నిరాశపరిచినా.. వాషింగ్టన్ సుందర్ (5 నాటౌట్) ఒక బౌండరీ బాదాడు.
146 పరుగుల లక్ష్యఛేదనని చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఛేదనని ప్రారంభించిన డుప్లెసిస్ (25: 13 బంతుల్లో 2x4, 2x6) భారీ షాట్లతో చెలరేగిపోయాడు. పవర్ ప్లేలోనే రుతురాజ్ కూడా కాస్త బ్యాట్ ఝళిపించడంతో 5 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 46/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే.. ఆరో ఓవర్ తొలి బంతికే డుప్లెసిస్ ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (39: 27 బంతుల్లో 3x4, 2x6) స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకుని రుతురాజ్పై ఒత్తిడి తగ్గించాడు. కానీ.. జట్టు స్కోరు 113 వద్ద చాహల్ బౌలింగ్లో బ్యాట్ని అడ్డంగా ఊపేసి రాయుడు బౌల్డయ్యాడు. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోనీ (19 నాటౌట్: 21 బంతుల్లో 3x4).. చివర్లో రుతురాజ్కి చక్కటి సహకారం అందించగా.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లోనే సిక్స్తో రుతురాజ్ మ్యాచ్ని ముగించాడు.
మ్యాచ్లో అంతకముందు టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. ఇన్నింగ్స్ ప్రారంభించిన పడిక్కల్ (22: 21 బంతుల్లో 2x4, 1x6), అరోన్ ఫించ్ (15: 11 బంతుల్లో 3x4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైపోగా.. అనంతరం వచ్చిన ఏబీ డివిలియర్స్తో కలిసి విరాట్ కోహ్లీ సమయోచితంగా ఆడాడు. స్పిన్నర్లు ఊరిస్తూ బంతుల్ని విసిరినా.. ఓపికగా సింగిల్, డబుల్స్తో సరిపెట్టిన ఈ జోడీ.. స్కోరు బోర్డు 100 దాటే వరకూ ఎలాంటి సాహసోపేత షాట్లు ఆడలేదు. అయితే.. స్లాగ్ ఓవర్లలో గేర్ మార్చే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఏబీ డివిలియర్స్ (39: 36 బంతుల్లో 4x4) ఔటవగా.. తాజా సీజన్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ 19 ఓవర్లో భారీ షాట్కి ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. ఆఖర్లో మొయిన్ అలీ (1), క్రిస్ మోరీస్ (2), గుర్కీరత్ (2 నాటౌట్) నిరాశపరిచినా.. వాషింగ్టన్ సుందర్ (5 నాటౌట్) ఒక బౌండరీ బాదాడు.