యాప్నగరం

CSK vs RR: చేతులెత్తేసిన చెన్నై టాప్ ఆర్డర్.. రాజస్థాన్ టార్గెట్ 126

ఐపీఎల్ తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన చెన్నై టీమ్ మూడింట్లో గెలుపొందగా.. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాల్సి ఉంది. కానీ.. ఈరోజు రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లు తేలిపోయారు.

Samayam Telugu 19 Oct 2020, 9:29 pm
ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో అబుదాబి వేదికగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో రవీంద్ర జడేజా (35 నాటౌట్: 30 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, కార్తీక్ త్యాగీ, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాటియా తలో వికెట్ పడగొట్టారు.
Samayam Telugu MS Dhoni Run Out (Photo Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. శామ్ కరన్‌ (22: 25 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి చెన్నై ఇన్నింగ్స్ ఆరంభించిన డుప్లెసిస్ (10: 9 బంతుల్లో 1x4) మూడో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా.. అనంతరం వచ్చిన షేన్ వాట్సన్ (8), అంబటి రాయుడు (13) నిరాశపరిచారు. దాంతో.. 10 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై 56/4తో నిలిచింది. ఈ దశలో రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన మహేంద్రసింగ్ ధోనీ (28: 28 బంతుల్లో 2x4) ఐదో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ధోనీ రనౌటవగా.. ఆఖర్లో కేదార్ జాదవ్ (4 నాటౌట్: 7 బంతుల్లో) దూకుడుగా ఆడలేకపోయాడు. అయినప్పటికీ.. జడేజా కాస్త బ్యాట్ ఝళిపించడంతో చెన్నై 125 పరుగులైనా చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.