ఐపీఎల్ 2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తప్పిదాలు కొనసాగుతున్నాయి. ముంబయి ఇండియన్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో డీఆర్ఎస్ కోరడంలో ఫెయిలైన ధోనీ.. ఢిల్లీ క్యాపిటల్స్తో దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా (64: 43 బంతుల్లో 9x4, 1x6) క్యాచ్ పట్టినా ఔట్ కోసం అప్పీల్ చేయలేదు. దాంతో.. డకౌటవ్వాల్సిన పృథ్వీ షా తొలి ఓవర్లోనే జీవనదానం పొంది వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు.
మ్యాచ్లో టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ని ప్రారంభించారు. ఈ క్రమంలో తొలి ఓవర్ని ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ వేయగా.. మొదటి బంతికి పరుగులు ఏమీ చేయని పృథ్వీ షా.. రెండో బంతిని కవర్స్ దిశగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతిని నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఔట్ కోసం ధోనీతో పాటు బౌలర్ దీపక్ చాహర్ అప్పీల్ చేయలేదు. దాంతో.. ఫీల్డ్ అంపైర్ కూడా మౌనంగా ఉండిపోయాడు. అయితే.. జట్టు స్కోరు 103 వద్ద ధోనీనే పృథ్వీ షాని స్టంపౌట్ చేశాడు.
వాస్తవానికి గతంలో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకుంటే.. స్టేడియంలోని అభిమానుల అరుపుల కారణంగా బ్యాట్కి బంతి తాకిన శబ్ధం వినపడలేదని ఫీల్డింగ్ టీమ్ కారణాలు చెప్పేది. కానీ.. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. బంతి బ్యాట్కి తాకినా పృథ్వీ షా తెలివిగా తాను ఏమీ ఎరుగనట్లు సైలెంట్గా క్రీజులో ఉండిపోయాడు.
మ్యాచ్లో టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ని ప్రారంభించారు. ఈ క్రమంలో తొలి ఓవర్ని ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ వేయగా.. మొదటి బంతికి పరుగులు ఏమీ చేయని పృథ్వీ షా.. రెండో బంతిని కవర్స్ దిశగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతిని నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఔట్ కోసం ధోనీతో పాటు బౌలర్ దీపక్ చాహర్ అప్పీల్ చేయలేదు. దాంతో.. ఫీల్డ్ అంపైర్ కూడా మౌనంగా ఉండిపోయాడు. అయితే.. జట్టు స్కోరు 103 వద్ద ధోనీనే పృథ్వీ షాని స్టంపౌట్ చేశాడు.
వాస్తవానికి గతంలో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకుంటే.. స్టేడియంలోని అభిమానుల అరుపుల కారణంగా బ్యాట్కి బంతి తాకిన శబ్ధం వినపడలేదని ఫీల్డింగ్ టీమ్ కారణాలు చెప్పేది. కానీ.. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. బంతి బ్యాట్కి తాకినా పృథ్వీ షా తెలివిగా తాను ఏమీ ఎరుగనట్లు సైలెంట్గా క్రీజులో ఉండిపోయాడు.