ఐపీఎల్ 2020 సీజన్లో మరో మ్యాచ్ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో అబుదాబి వేదికగా శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్లో చివరి బంతి వరకూ పోరాడిన కోల్కతా నైట్రైడర్స్ 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. పంజాబ్ విజయానికి చివరి 6 బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ (10 నాటౌట్: 5 బంతుల్లో 2x4) ఉండటంతో.. పంజాబ్ ధీమాగానే ఉంది. కానీ.. అద్భుతంగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ సునీల్ నరైన్.. ఆ ఓవర్లో 11 పరుగులే ఇచ్చి మన్దీప్ సింగ్ (0) వికెట్ పడగొట్టాడు. చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైన దశలో మాక్స్వెల్ భారీ షాట్ ఆడినా.. బౌండరీ లైన్కి సెంటీమీటర్ల దూరంలో పడిన బంతి ఫోర్గా వెళ్లింది.
164 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (56: 39 బంతుల్లో 6x4, 1x6), కేఎల్ రాహుల్ (74: 58 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు బాదడంతో అలవోకగా విజయం సాధించేలా కనిపించింది. కానీ.. జట్టు స్కోరు 115 వద్ద మయాంక్ అగర్వాల్ ఔటవగా.. అనంతరం వచ్చిన నికోలస్ పూరన్ (16: 10 బంతుల్లో 2x4, 1x6), సిమ్రాన్ సింగ్ (4: 7 బంతుల్లో) తక్కువ స్కోరుకే ఔటవడంతో పంజాబ్పై ఒత్తిడి పెరిగింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కేఎల్ రాహుల్ బౌల్డవడం కూడా ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. చివరి ఓవర్లో మాక్స్వెల్ అంచనాల్ని అందుకోలేకపోవడంతో పంజాబ్ 162/5తో సరిపెట్టింది.
మ్యాచ్లో అంతకముందు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (58: 29 బంతుల్లో 8x4, 2x6), ఓపెనర్ శుభమన్ గిల్ (57: 47 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తాజా సీజన్లో కార్తీక్కి ఇది తొలి అర్ధశతకంకాగా.. శుభమన్ గిల్కి ఇది రెండోది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీయగా.. మ్యాచ్ ఆరంభంలో నితీశ్ రాణా (2), ఆఖర్లో దినేశ్ కార్తీక్ రనౌటయ్యారు.
164 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (56: 39 బంతుల్లో 6x4, 1x6), కేఎల్ రాహుల్ (74: 58 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీలు బాదడంతో అలవోకగా విజయం సాధించేలా కనిపించింది. కానీ.. జట్టు స్కోరు 115 వద్ద మయాంక్ అగర్వాల్ ఔటవగా.. అనంతరం వచ్చిన నికోలస్ పూరన్ (16: 10 బంతుల్లో 2x4, 1x6), సిమ్రాన్ సింగ్ (4: 7 బంతుల్లో) తక్కువ స్కోరుకే ఔటవడంతో పంజాబ్పై ఒత్తిడి పెరిగింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కేఎల్ రాహుల్ బౌల్డవడం కూడా ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. చివరి ఓవర్లో మాక్స్వెల్ అంచనాల్ని అందుకోలేకపోవడంతో పంజాబ్ 162/5తో సరిపెట్టింది.
మ్యాచ్లో అంతకముందు కెప్టెన్ దినేశ్ కార్తీక్ (58: 29 బంతుల్లో 8x4, 2x6), ఓపెనర్ శుభమన్ గిల్ (57: 47 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తాజా సీజన్లో కార్తీక్కి ఇది తొలి అర్ధశతకంకాగా.. శుభమన్ గిల్కి ఇది రెండోది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీయగా.. మ్యాచ్ ఆరంభంలో నితీశ్ రాణా (2), ఆఖర్లో దినేశ్ కార్తీక్ రనౌటయ్యారు.