యాప్నగరం

RR vs MI: సూర్యకుమార్ 79 నాటౌట్.. రాజస్థాన్ టార్గెట్ 194

ముంబయి ఇండియన్స్ మిడిలార్డర్ మరోసారి ఆ జట్టుని ఆదుకుంది. కీలక సమయంలో రోహిత్ శర్మ, డికాక్‌తో పాటు ఇషాన్ ఔటైనా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ ఎడాపెడా ఫోర్లు బాది ఆ జట్టుకి గౌరవమైన స్కోరుని అందించాడు.

Samayam Telugu 6 Oct 2020, 9:47 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ మరోసారి భారీ స్కోరుని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (79 నాటౌట్: 47 బంతుల్లో 11x4, 2x6) హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లోనే హార్దిక్ పాండ్య (30 నాటౌట్: బంతుల్లో 2x4, 1x6) క్రీజులోకి వచ్చినప్పటికీ అంచనాల్ని అందుకోలేకపోయాడు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయాస్ గోపాల్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోప్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి చెరొక వికెట్ తీశారు.
Samayam Telugu Suryakumar Yadav (Pic Credit: IPL/Twitter)




మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి ఓవర్ నుంచే ఓపెనర్ డికాక్ (23: 15 బంతుల్లో 3x4, 1x6) దూకుడుగా ఆడేశాడు. మరోవైపు రోహిత్ శర్మ (35: 23 బంతుల్లో 2x4, 3x6) వరుస ఫుల్ షాట్లు ఆడటంతో.. ముంబయి ఇండియన్స్ 4.5 ఓవర్లు ముగిసే సమయానికి 49/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ దశలో డికాక్ ఔటవగా.. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడాడు. కానీ.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన స్పిన్నర్ శ్రేయాస్ అయ్యర్.. ముంబయిని ఒత్తిడిలోకి నెట్టాడు. వరుస బంతుల్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (0)లను అతను ఔట్ చేయడంతో.. ముంబయి తక్కువ స్కోరుతో సరిపెట్టుకునేలా కనిపించింది. అయితే.. చివర్లో జోప్రా ఆర్చర్, టామ్ కరన్‌తో పాటు అంకిత్ రాజ్‌పుత్ బౌలింగ్‌లోనూ సాహసోపేత స్వీప్ షాట్లు ఆడిన సూర్యకుమార్.. ముంబయికి 193 పరుగుల స్కోరుని అందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.