యాప్నగరం

ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక.. టాప్-4‌లో ఎవరూ ఊహించని జట్లు

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పంజాబ్, రాజస్థాన్ తరచూ చిట్టచివరి స్థానం కోసం పోటీపడేవి. కానీ.. ఇప్పుడు ఆ రెండు జట్లు టాప్-3లో కొనసాగుతుండగా.. చెన్నై, బెంగళూరు మాత్రం..?

Samayam Telugu 28 Sep 2020, 9:55 am
ఐపీఎల్ 2020 సీజన్‌ రసవత్తరంగా జరుగుతోంది. టోర్నీలో ఇప్పటికే 9 మ్యాచ్‌లు ముగియగా.. పాయింట్ల పట్టికలో ఎవరూ ఊహించని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. టోర్నీకి ముందు రాజస్థాన్ రాయల్స్ టీమ్ పట్టికలో చిట్టచివరి స్థానానికి పరిమితమవుతుందని మాజీ క్రికెటర్లు అంచనా వేయగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ టీమ్‌ కూడా టాప్-4 ఉంటుదని ఎవరూ అంచనాలు వేయలేదు.
Samayam Telugu Rajasthan Royals
Rajasthan Royals batsman Jofra Archer celebrates with his teammate after winning the Indian Premier League 2020 cricket match against Kings XI Punjab, at Sharjah Cricket Stadium, Sharjah.Photo/Sportzpics for BCCI)(


సీజన్ లీగ్ దశలో ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌లను ఆడనుండగా.. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనూ గెలుపొందడం ద్వారా నెం.1 స్థానంలో నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా ఆడిన రెండింటిలోనూ విజయం సాధించడం ద్వారా రెండో స్థానానికి ఎగబాకింది. ఇక పంజాబ్ జట్టు మూడు మ్యాచ్‌లాడి.. ఒకదాంట్లో ఓడినా.. మూడో స్థానంలో నిలవగా.. నాలుగులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కొనసాగుతోంది.


ఐపీఎల్ 2020లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ (2 పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2), సన్‌రైజర్స్ హైదరాబాద్ (0) పట్టికలో చివరి మూడు స్థానాలకే పరిమితమవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శనివారం రాత్రి గెలుపొందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.