యాప్నగరం

IPL 2020 పాయింట్ల పట్టికలో RCB మళ్లీ టాప్-4లోకి.. మరి CSK..?

ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబయి, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ప్లేఆఫ్‌కి అర్హత సాధించగా.. తాజాాగా ఆ జట్లలో ఢిల్లీ మినహా ఏ టీమ్ కూడా పాయింట్ల పట్టికలో టాప్-4లో కూడా లేవు.

Samayam Telugu 29 Sep 2020, 8:42 am
ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్లీ జోరందుకుంది. ముంబయి ఇండియన్స్‌పై దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో గెలుపొందిన బెంగళూరు టీమ్ పాయింట్ల పట్టికలోనూ ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. పట్టికలో టాప్-4లో వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఉండగా.. నెట్‌ రన్‌రేట్‌లో మాత్రం మైనస్‌లో ఉన్న ఉన్న టీమ్ ఆర్సీబీనే కావడం గమనార్హం.
Samayam Telugu IPL 2020 Points Table (Image Credit: IPL/Twitter)


బెంగళూరు చేతిలో దుబాయ్‌లో ఓడినప్పటికీ.. ఐదో స్థానంలో నిలిచిన ముంబయి టీమ్.. నెట్‌ రన్‌రేట్‌ని ప్లస్‌లో ఉంచుకోగలిగింది. ఇక ఆరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఉండగా.. వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిలిచాయి. టోర్నీలో ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లు ముగియగా.. గెలుపు బోణి అందుకోని జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే.


ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశలో 56 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రతి జట్టూ మిగిలిన ఏడు జట్లతో రెండేసి మ్యాచ్‌ల రూపంలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. గత ఏడాది ఫైనల్‌కి చేరిన ముంబయి, చెన్నై ప్రస్తుతం టాప్-4లో కూడా లేకపోవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.