ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగాడు. కోల్కతా నైట్రైడర్స్తో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ (73 నాటౌట్: 33 బంతుల్లో 5x4, 6x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్ ఎడా పెడా బౌండరీలు బాదేయడంతో బెంగళూరు టీమ్ చివరి 5 ఓవర్లలో ఏకంగా 83 పరుగులు రాబట్టింది. కోల్కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్, ప్రసీద్ క్రిష్ణ చెరొక వికెట్ పడగొట్టారు.
మ్యాచ్లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు అరోన్ ఫించ్ (47: 37 బంతుల్లో 4x4, 1x6), దేవదత్ పడిక్కల్ (32: 23 బంతుల్లో 4x4, 1x6) ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. తొలి వికెట్కి 7.4 ఓవర్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని ఆండ్రీ రసెల్ కళ్లు చెదిరే యార్కర్తో విడదీశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అరోన్ ఫించ్ని కూడా ప్రసీద్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేయడంతో.. బెంగళూరు 12.2 ఓవర్లు ముగిసే సమయానికి 94/2తో నిలిచింది.
ఇన్నింగ్స్ 13 ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆ ఓవర్ వేసిన నాగర్కోటి బౌలింగ్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదిన ఏబీడీ.. తర్వాత కమిన్స్ వేసిన 17వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదేసి 19 పరుగుల్ని పిండుకున్నాడు. ఇక 18వ ఓవర్ వేసిన రసెల్ బౌలింగ్లో తొలి రెండు బంతులకీ 4, 6 బాదినా.. ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఆడిన డివిలియర్స్.. 19 ఓవర్లోనూ బౌండరీ సాధించలేకపోయాడు. కానీ.. చివరి ఓవర్లో మరోసారి రసెల్ బౌలింగ్కిరాగా.. సిక్స్, ఫోర్ బాది 17 పరుగులు రాబట్టాడు. మొత్తంగా.. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు పిండుకుంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (33 నాటౌట్: 28 బంతుల్లో 1x4) ఆఖరి వరకూ స్ట్రైక్ రొటేట్ చేయడంతోనే సరిపెట్టాడు.
మ్యాచ్లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు అరోన్ ఫించ్ (47: 37 బంతుల్లో 4x4, 1x6), దేవదత్ పడిక్కల్ (32: 23 బంతుల్లో 4x4, 1x6) ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. తొలి వికెట్కి 7.4 ఓవర్లో 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని ఆండ్రీ రసెల్ కళ్లు చెదిరే యార్కర్తో విడదీశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అరోన్ ఫించ్ని కూడా ప్రసీద్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేయడంతో.. బెంగళూరు 12.2 ఓవర్లు ముగిసే సమయానికి 94/2తో నిలిచింది.
ఇన్నింగ్స్ 13 ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఆ ఓవర్ వేసిన నాగర్కోటి బౌలింగ్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదిన ఏబీడీ.. తర్వాత కమిన్స్ వేసిన 17వ ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదేసి 19 పరుగుల్ని పిండుకున్నాడు. ఇక 18వ ఓవర్ వేసిన రసెల్ బౌలింగ్లో తొలి రెండు బంతులకీ 4, 6 బాదినా.. ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఆడిన డివిలియర్స్.. 19 ఓవర్లోనూ బౌండరీ సాధించలేకపోయాడు. కానీ.. చివరి ఓవర్లో మరోసారి రసెల్ బౌలింగ్కిరాగా.. సిక్స్, ఫోర్ బాది 17 పరుగులు రాబట్టాడు. మొత్తంగా.. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 83 పరుగులు పిండుకుంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (33 నాటౌట్: 28 బంతుల్లో 1x4) ఆఖరి వరకూ స్ట్రైక్ రొటేట్ చేయడంతోనే సరిపెట్టాడు.