ఐపీఎల్ 2020 సీజన్లో ఒక్క మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ పవర్ హిట్టర్ రాహుల్ తెవాటియా.. ఆ టీమ్కి హీరోగా మారిపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో ఆదివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో వరుస సిక్సర్లు బాదేసిన రాహుల్ తెవాటియా (53: 31 బంతుల్లో 7x6).. రాజస్థాన్కి సంచలన విజయాన్ని అందించాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్ (106: 50 బంతుల్లో 10x4, 7x6) సెంచరీ బాదడంతో 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా.. అనంతరం సంజు శాంసన్ (85: 42 బంతుల్లో 4x4, 7x6), స్టీవ్స్మిత్ (50: 27 బంతుల్లో 7x4, 2x6)తో పాటు రాహుల్ తెవాటియా మెరుపులు మెరిపించడంతో 19.3 ఓవర్లలోనే రాజస్థాన్ 226/6తో లక్ష్యాన్ని ఛేదించేసింది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 215 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని ఓ జట్టు ఛేదించడం ఇదే తొలిసారి.
ఇన్నింగ్స్ 9వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా.. చాలా లేట్గా టచ్లోకి వచ్చాడు. అతని ఒత్తిడిని ఆసరాగా తీసుకున్న పంజాబ్ బౌలర్లు వరుసగా బంతుల్ని డాట్ చేశారు. ఎంతలా అంటే..? ఫస్ట్ 19 బంతుల్లో తెవాటియా చేసింది 8 పరుగులే. ఇందులో ఒక్క ఫోర్ కూడా లేదు. కానీ.. రాజస్థాన్ విజయానికి 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో బ్యాట్ ఝళిపించిన రాహుల్ తెవాటియా వరుసగా 6, 6, 6, 6, 0, 6, 6 బాదేశాడు. దాంతో.. చివర్లో తాను ఎదుర్కొన్న 12 బంతుల్లోనే తెవాటియా 45 పరుగుల్ని రాబట్టగా.. ఇందులో ఏడు సిక్సర్లు ఉండటం గమనార్హం. 18వ ఓవర్లో కాట్రెల్ బౌలింగ్లో తెవాటియా ఐదు సిక్సర్లు బాదడం మ్యాచ్లో కీలక మలుపు.
వాస్తవానికి ఐపీఎల్లో రాహుల్ తెవాటియా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయలేదు. దాంతో.. అతడ్ని నాలుగో స్థానంలో అదీ.. భారీ స్కోరు ఛేదన సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ పంపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దానికి తోడు అతను బంతుల్ని వరుసగా వేస్ట్ చేయడంతో.. సోషల్ మీడియాలో రాజస్థాన్పై ఫస్ట్ సెటైర్ల వర్షం కురిసింది. కానీ.. నిమిషాల వ్యవధిలోనే రాజస్థాన్ రాయల్స్ వ్యూహం పంజాబ్తో పాటు అందరికీ తెలిసొచ్చింది. అయితే.. అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
రాహుల్ తెవాటియాని అలా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడంపై ఆ టీమ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ ‘‘అతడ్ని టీమ్లోకి తొలుత కేవలం లెగ్ స్పిన్నర్గా మాత్రమే తీసుకున్నాం. కానీ.. టీమ్ క్యాంప్లో అతను తనలోని పవర్ హిట్టింగ్ స్కిల్స్ని మాకు చూపించాడు. జట్టులో ఓ ఓవర్లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు..? అనే పోటీ జరగగా.. తెవాటియా 4-5 సిక్సర్లు బాదేసేవాడు. దాంతో.. అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది’’ అని వెల్లడించాడు.
ఇన్నింగ్స్ 9వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా.. చాలా లేట్గా టచ్లోకి వచ్చాడు. అతని ఒత్తిడిని ఆసరాగా తీసుకున్న పంజాబ్ బౌలర్లు వరుసగా బంతుల్ని డాట్ చేశారు. ఎంతలా అంటే..? ఫస్ట్ 19 బంతుల్లో తెవాటియా చేసింది 8 పరుగులే. ఇందులో ఒక్క ఫోర్ కూడా లేదు. కానీ.. రాజస్థాన్ విజయానికి 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో బ్యాట్ ఝళిపించిన రాహుల్ తెవాటియా వరుసగా 6, 6, 6, 6, 0, 6, 6 బాదేశాడు. దాంతో.. చివర్లో తాను ఎదుర్కొన్న 12 బంతుల్లోనే తెవాటియా 45 పరుగుల్ని రాబట్టగా.. ఇందులో ఏడు సిక్సర్లు ఉండటం గమనార్హం. 18వ ఓవర్లో కాట్రెల్ బౌలింగ్లో తెవాటియా ఐదు సిక్సర్లు బాదడం మ్యాచ్లో కీలక మలుపు.
వాస్తవానికి ఐపీఎల్లో రాహుల్ తెవాటియా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయలేదు. దాంతో.. అతడ్ని నాలుగో స్థానంలో అదీ.. భారీ స్కోరు ఛేదన సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ పంపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దానికి తోడు అతను బంతుల్ని వరుసగా వేస్ట్ చేయడంతో.. సోషల్ మీడియాలో రాజస్థాన్పై ఫస్ట్ సెటైర్ల వర్షం కురిసింది. కానీ.. నిమిషాల వ్యవధిలోనే రాజస్థాన్ రాయల్స్ వ్యూహం పంజాబ్తో పాటు అందరికీ తెలిసొచ్చింది. అయితే.. అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
రాహుల్ తెవాటియాని అలా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపడంపై ఆ టీమ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మాట్లాడుతూ ‘‘అతడ్ని టీమ్లోకి తొలుత కేవలం లెగ్ స్పిన్నర్గా మాత్రమే తీసుకున్నాం. కానీ.. టీమ్ క్యాంప్లో అతను తనలోని పవర్ హిట్టింగ్ స్కిల్స్ని మాకు చూపించాడు. జట్టులో ఓ ఓవర్లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు..? అనే పోటీ జరగగా.. తెవాటియా 4-5 సిక్సర్లు బాదేసేవాడు. దాంతో.. అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది’’ అని వెల్లడించాడు.