యాప్నగరం

బ్యాటింగ్‌లో హైదరాబాద్ తడబాటు.. కోల్‌కతా టార్గెట్ 143

కోల్‌కతా బౌలర్లని సహనంతో ఎదుర్కొన్న మనీశ్ పాండే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. అతనికి సపోర్ట్ ఇచ్చేవారు టీమ్‌లో కరవయ్యారు. సాహా ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా వేగంగా ఆడలేకపోయాడు.

Samayam Telugu 26 Sep 2020, 9:38 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే (51: 38 బంతుల్లో 3x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోల్‌కతా బౌలర్లలో పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ తీశారు.
Samayam Telugu Manish Pandey (Image Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5: 10 బంతుల్లో) నిరాశపరచగా.. అనంతరం వచ్చిన మనీశ్ పాండే‌తో కలిసి డేవిడ్ వార్నర్ (36: 30 బంతుల్లో 2x4, 1x6) నెమ్మదిగా ఇన్నింగ్స్ నడిపించాడు. కానీ.. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో మిథున్ చక్రవర్తి విసిరిన బంతిని అర్థం చేసుకోలేక వార్నర్ ఔటవగా.. తర్వాత వచ్చిన సాహా (30: 31 బంతుల్లో 1x4, 1x6) ఆశించిన వేగంగా ఆడలేకపోయాడు. అయినప్పటికీ.. చివర్లో మహ్మద్ నబీ (11 నాటౌట్: 8 బంతుల్లో 2x4) రెండు బౌండరీలు బాదడంతో హైదరాబాద్ 142 పరుగులైనా చేయగలిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.