యాప్నగరం

KXIPకి శాపంగా మారిన అంపైర్ తప్పిదం.. సాక్ష్యం వెలుగులోకి

ఒక్క పరుగు.. మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకూ గెలుపు ధీమాతో ఉన్న పంజాబ్‌ని నిరాశలో ముంచెత్తగా.. ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ టీమ్‌లో ఉత్సాహం నింపింది. ఆ ఒక్క పరుగు.. సూపర్ ఓవర్‌కి దారితీసింది. ఈ మొత్తానికీ కారణం అంపైర్ తప్పిదం.

Samayam Telugu 21 Sep 2020, 8:12 am
ఐపీఎల్ 2020 సీజన్‌ ఆరంభంలోనే ఫీల్డ్ అంపైర్ తప్పిదాలకి పాల్పడ్డారు. గత ఏడాది నోబాల్స్ విషయంలో అంపైర్ల తప్పిదాలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో.. ఈసారి కొత్తగా టీవీ అంపైర్‌ ఆ నోబాల్స్‌ని నిర్ణయించే బాధ్యతని తీసుకున్నాడు. కానీ.. తాజాగా ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ ప్రకటించిన ‘షార్ట్ రన్’ తప్పిద నిర్ణయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ ఓడిపోయింది. దాంతో.. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, పంజాబ్ కో-ఓనర్ ప్రీతిజింటా‌తో పాటు క్రికెట్ అభిమానులు అంపైర్‌ని ఉతికారేస్తున్నారు.
Samayam Telugu DC vs KXIP Short Run Controversy (Photo Credit: Twitter)


Read More: undefined

అసలు ఏం జరిగిందంటే..? తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటిల్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. 158 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ విజయానికి చివరి 12 బంతుల్లో 25 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ చేతికి బంతినిచ్చాడు. దాంతో.. 19 ఓవర్‌లో జాగ్రత్తగా ఆడిన మయాంక్ అగర్వాల్ (89: 60 బంతుల్లో 7x4, 4x6) సాహసోపేత షాట్లకి వెళ్లకుండా రెండు ఫోర్లు బాది.. ఎక్కువగా డబుల్స్ తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ఓవర్‌ మూడో బంతిని వికెట్లకి వెలుపలగా ఫుల్‌టాస్ రూపంలో రబాడ విసరగా.. ఎక్స్‌ట్రా కవర్ దిశగా నెట్టిన మయాంక్ డబుల్ పరుగెత్తాడు. అయితే.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న క్రిస్‌ జోర్దాన్ సింగిల్‌ని పూర్తి చేసే క్రమంలో కీపర్ ఎండ్‌వైపు సరిగా క్రీజులో బ్యాట్ పెట్టలేదని తేల్చిన స్వ్కేర్‌ లెగ్‌ అంపైర్ నితిన్ మీనన్.. షార్ట్ రన్‌గా ప్రకటించి ఒక పరుగు మాత్రమే పంజాబ్‌కి ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో మయాంక్ ఔటవడంతో పంజాబ్ కూడా సరిగ్గా 157/8తో నిలిచింది. దాంతో.. స్కోర్లు సమమై మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారితీసింది. ఈ సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలుపొందింది.

Read More: undefined

వాస్తవానికి క్రిస్‌ జోర్దాన్ క్రీజు లోపల కరెక్ట్‌గానే బ్యాట్ ఉంచినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫొటోతో సహా ట్వీట్ చేసి.. అంపైర్ తప్పిదాన్ని విమర్శించగా.. ఆ పరుగు కారణంగానే పంజాబ్ ఓడిపోయిందని అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఐసీసీ ఎలైట్ ఫ్యానల్ అంపైర్‌గా ఉన్న నితిన్ మీనన్ ఈ తరహాలో తప్పిదం చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.




తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.