ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. గత వారం వరకూ వరుస పరాజయాలతో కనిపించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తాజాగా హ్యాట్రిక్ విజయాలతో మళ్లీ పోటీలో నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా మళ్లీ గెలుపు బాట పట్టి ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. దాంతో.. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగిలిన అన్ని జట్లూ ఇంకా ప్లేఆఫ్ రేసులోనే ఉన్నాయి. ఢిల్లీక్యాపిటల్స్తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ టీమ్ 5 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
లీగ్ దశలో ప్రతి జట్టూ ఇంకా కనీసం నాలుగేసి మ్యాచ్లు ఆడనుండగా.. లీగ్ దశ ముగిసే సమయానికి ఏ జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధిస్తాయో..? స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొలింది. ఎందుకంటే..? చెన్నై మినహా మిగిలిన ఏడు జట్లకీ 18 పాయింట్లు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 10 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్లో ఉండగా.. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. అయితే.. ఇందులో టాప్-2లో ఉన్న ఢిల్లీ, ముంబయి చివరిగా ఆడిన మ్యాచ్లో పేలవంగా ఓడిపోయాయి. ఈ రెండింటికీ ఓటమి రుచి చూపింది మొన్నటి వరకూ పాయింట్ల పట్టిక చివర్లో ఉన్న పంజాబ్ కావడం గమనార్హం.
తాజా సీజన్లో జట్లు చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల ఫలితాల్ని ఓసారి పరిశీలిస్తే..? పంజాబ్ మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొందగా.. కనీసం ఏ జట్టు కూడా వరుసగా రెండు విజయాల్ని నమోదు చేయలేకపోయింది. బెంగళూరు, కోల్కతా, రాజస్థాన్ మాత్రం మూడు మ్యాచ్లకిగానూ ఒక మ్యాచ్లో గెలుపొందాయి. మొత్తంగా.. లీగ్ దశ సగం వరకూ పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు.. టాప్-4లో ఉన్న జట్లకి షాకిస్తూ వాటి అవకాశాల్ని దెబ్బతీయడమే కాకుండా తమ ప్లేఆఫ్ ఛాన్స్లను కూడా మెరుగుపర్చుకుంటున్నాయి. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోగా.. ఈ తరహా ఏ జట్టు కూడా గత వారం రోజులుగా హ్యాట్రిక్ ఓటముల్ని చవిచూడలేదు.
లీగ్ దశలో ప్రతి జట్టూ ఇంకా కనీసం నాలుగేసి మ్యాచ్లు ఆడనుండగా.. లీగ్ దశ ముగిసే సమయానికి ఏ జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధిస్తాయో..? స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొలింది. ఎందుకంటే..? చెన్నై మినహా మిగిలిన ఏడు జట్లకీ 18 పాయింట్లు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 10 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్లో ఉండగా.. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. అయితే.. ఇందులో టాప్-2లో ఉన్న ఢిల్లీ, ముంబయి చివరిగా ఆడిన మ్యాచ్లో పేలవంగా ఓడిపోయాయి. ఈ రెండింటికీ ఓటమి రుచి చూపింది మొన్నటి వరకూ పాయింట్ల పట్టిక చివర్లో ఉన్న పంజాబ్ కావడం గమనార్హం.
తాజా సీజన్లో జట్లు చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల ఫలితాల్ని ఓసారి పరిశీలిస్తే..? పంజాబ్ మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొందగా.. కనీసం ఏ జట్టు కూడా వరుసగా రెండు విజయాల్ని నమోదు చేయలేకపోయింది. బెంగళూరు, కోల్కతా, రాజస్థాన్ మాత్రం మూడు మ్యాచ్లకిగానూ ఒక మ్యాచ్లో గెలుపొందాయి. మొత్తంగా.. లీగ్ దశ సగం వరకూ పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు.. టాప్-4లో ఉన్న జట్లకి షాకిస్తూ వాటి అవకాశాల్ని దెబ్బతీయడమే కాకుండా తమ ప్లేఆఫ్ ఛాన్స్లను కూడా మెరుగుపర్చుకుంటున్నాయి. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోగా.. ఈ తరహా ఏ జట్టు కూడా గత వారం రోజులుగా హ్యాట్రిక్ ఓటముల్ని చవిచూడలేదు.