IPL 2021 కోసం యూఏఈకి బయల్దేరిన CSK టీమ్.. ఫొటోలు వైరల్
ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని జట్ల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ యూఏఈకి బయల్దేరి వెళ్లింది. ఫస్ట్ మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్తో చెన్నై టీమ్ తలపడనుండగా..
Samayam Telugu 13 Aug 2021, 4:38 pm
ప్రధానాంశాలు:
- యూఏఈకి బయల్దేరి వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్
- సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ మొదలు
- ఫస్ట్ మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్తో చెన్నై ఢీ
- పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై
ఐపీఎల్ 2021 కోసం యూఏఈకి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ బయల్దేరి వెళ్లింది. రెండు రోజుల క్రితం కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో సహా భారత్లోని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు చెన్నైకి చేరుకోగా.. శుక్రవారం అక్కడి నుంచి క్రికెటర్లు యూఏఈకి పయనమయ్యారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొన్ని ఫొటోల్ని అభిమానులతో పంచుకోగా.. నిమిషాల్లోనే అవి వైరల్గా మారాయి. విమానాశ్రయంలో ధోనీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
ఐపీఎల్ 2021 సీజన్లో ఇంకా 31 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ యూఏఈ వేదికగా టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించబోతోంది. సెప్టెంబరు 19న ఫస్ట్ మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఆ తర్వాత 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో షార్జా వేదికగా చెన్నై మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదింట్లో గెలుపొంది.. పది పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో 8 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలతో ఉండగా.. మూడు, నాలుగు స్థానాల్లో బెంగళూరు (10 పాయింట్లు), ముంబయి (8) ఉన్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్లో ఇంకా 31 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 15 వరకూ యూఏఈ వేదికగా టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించబోతోంది. సెప్టెంబరు 19న ఫస్ట్ మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఆ తర్వాత 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో షార్జా వేదికగా చెన్నై మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదింట్లో గెలుపొంది.. పది పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో 8 మ్యాచ్లాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలతో ఉండగా.. మూడు, నాలుగు స్థానాల్లో బెంగళూరు (10 పాయింట్లు), ముంబయి (8) ఉన్నాయి.