ఐపీఎల్ 2021 సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ ముంబయి టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. కోల్కతా నైట్రైడర్స్తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్.. ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ (5/15) దెబ్బకి 152 పరుగులకే ఆలౌటైంది. ముంబయి జట్టులో సూర్యకుమార్ యాదవ్ (56: 36 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (43: 32 బంతుల్లో 3x4, 1x6) చెప్పుకోదగిన స్కోరు చేశాడు. కోల్కతా బౌలర్లతో రసెల్ ఐదు, పాట్ కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, ప్రసీద్ కృష్ణ తలో వికెట్ తీశారు. మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. రోహిత్ శర్మతో కలిసి ముంబయి ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఓపెనర్ డికాక్ (2: 6 బంతుల్లో) రెండో ఓవర్లోనే వరుణ్ చక్రవర్తికి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా.. హాఫ్ సెంచరీ తర్వాత టీమ్ స్కోరు 86 వద్ద సూర్యకుమార్ ఔటైపోయాడు. ఇక అక్కడి నుంచి ముంబయి కోలుకోలేకపోయింది.
నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఇషాక్ కిషన్ (1), ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (15), కీరన్ పొలార్డ్ (5) భారీ షాట్లు ఆడబోయి వికెట్లు చేజార్చుకున్నారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ఆండ్రీ రసెల్ బౌలింగ్లో తొలి రెండు బంతులకీ ఫోర్లు బాదిన కృనాల్ పాండ్యా (15).. మూడో బంతికి ఔటవగా.. నాలుగో బంతికి జస్ప్రీత్ బుమ్రా (0), ఆఖరి బంతికి రాహుల్ చాహర్ (8) వికెట్లు చేజార్చుకున్నారు. మొత్తంగా మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసిన రసెల్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముంబయి జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఇషాక్ కిషన్ (1), ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (15), కీరన్ పొలార్డ్ (5) భారీ షాట్లు ఆడబోయి వికెట్లు చేజార్చుకున్నారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ఆండ్రీ రసెల్ బౌలింగ్లో తొలి రెండు బంతులకీ ఫోర్లు బాదిన కృనాల్ పాండ్యా (15).. మూడో బంతికి ఔటవగా.. నాలుగో బంతికి జస్ప్రీత్ బుమ్రా (0), ఆఖరి బంతికి రాహుల్ చాహర్ (8) వికెట్లు చేజార్చుకున్నారు. మొత్తంగా మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసిన రసెల్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ముంబయి జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు.