ఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ జోరు కొనసాగుతోంది. కింగ్స్ పంజాబ్తో ఆదివారం షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. గ్లెన్ మాక్స్వెల్ (57: 33 బంతుల్లో 3x4, 4x6) మెరుపు అర్ధశతకం బాదడంతో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, హెన్రిక్యూస్ మూడేసి వికెట్లు పడగొట్టారు. మ్యాచ్లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో దేవదత్ పడిక్కల్ (40: 38 బంతుల్లో 4x4, 2x6)తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్ని ప్రారంభించిన విరాట్ కోహ్లీ (25: 24 బంతుల్లో 2x4, 1x6) తొలి వికెట్కి 9.4 ఓవర్లలో 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ.. ఐదు పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరినీ హెన్రిక్యూస్ పెవిలియన్ బాట పట్టించేశాడు. అలానే నెం.3లో వచ్చిన డేనియల్ క్రిస్టియన్ (0) కూడా హెన్రిక్యూస్ ఓవర్లో ఔటైపోవడంతో బెంగళూరు ఒత్తిడిలో పడింది. అయితే గ్లెన్ మాక్స్వెల్తో కలిసి కాసేపు క్రీజులో నిలిచిన ఏబీ డివిలియర్స్ (23: 18 బంతుల్లో 1x4, 2x6) మెరుపులు ఒక్క ఓవర్కే పరిమితమయ్యాయి. కానీ.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా హిట్టింగ్ చేసిన మాక్స్వెల్.. హాఫ్ సెంచరీ తర్వాత ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. చివర్లో షబాజ్ అహ్మద్ (8: 4 బంతుల్లో 1x6)ఒక సిక్స్ కొట్టడంతో బెంగళూరు 164 పరుగులు చేయగలిగింది.
Glenn Maxwell మెరుపు అర్ధశతకం.. పంజాబ్ టార్గెట్ 165
షార్జాలో గ్లెన్ మాక్స్వెల్ జూలు విదిల్చాడు. బ్యాటింగ్కి కష్టంగా కనిపించిన పిచ్పై స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన మాక్స్వెల్ నాలుగు సిక్సర్లు కూడా బాదేశాడు. దాంతో.. బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
Samayam Telugu 3 Oct 2021, 5:39 pm
ప్రధానాంశాలు:
- పంజాబ్పై హాఫ్ సెంచరీ బాదిన గ్లెన్ మాక్స్వెల్
- మూడేసి వికెట్లు పడగొట్టిన షమీ, హెన్రిక్యూస్
- చివర్లో రనౌట్గా వెనుదిరిగిన ఏబీ డివిలియర్స్
- తొలి వికెట్కి పడిక్కల్తో కలిసి కోహ్లీ 68 పరుగుల భాగస్వామ్యం