ఐపీఎల్ 2020 సీజన్ మంగళవారం ఫైనల్తో ముగియనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈసారి యూఏఈ వేదికగా టోర్నీని నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. వచ్చే ఏడాది మాత్రం భారత్లోనే ఐపీఎల్ని నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. యూఏఈ తరహాలోనే భారత్లో కూడా టోర్నీ కోసం బయో- సెక్యూర్ బబుల్ని క్రియేట్ చేస్తామని ధీమా వ్యక్తం చేసిన గంగూలీ.. ఇంగ్లాండ్ టూర్కి ఆతిథ్యమివ్వడంతో పాటు దేశవాళీ మ్యాచ్లు ఇకపై నిర్వహిస్తామని స్పష్టం చేశాడు.
2021, జనవరి చివర్లో భారత్ పర్యటనకి ఇంగ్లాండ్ రానుండగా.. ఆ జట్టుతో టీమిండియా ఐదు టెస్టులు, టీ20, వన్డేలను కూడా ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ని నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు గంగూలీ మాటల్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2021 సీజన్ని ఏప్రిల్- మే నెలలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే.. ఈసారి యూఏఈ వేదికగా కాకుండా.. భారత్లోనే ఈ టోర్నీని నిర్వహిస్తాం. అలానే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకి కూడా భారత్ ఆతిథ్యమిస్తుంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన రంజీ ట్రోఫీ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్లను తిరిగి ప్రారంభిస్తాం. అన్నింటికీ బయో బబుల్ని క్రియేట్ చేసి సురక్షిత వాతావరణంలో మ్యాచ్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని గంగూలీ వెల్లడించాడు.
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా.. 14 రోజులు క్వారంటైన్లో ఉండి.. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకూ అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులను ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో సొంతగడ్డపై భారత్ సిరీస్ని ఆడనుంది.
2021, జనవరి చివర్లో భారత్ పర్యటనకి ఇంగ్లాండ్ రానుండగా.. ఆ జట్టుతో టీమిండియా ఐదు టెస్టులు, టీ20, వన్డేలను కూడా ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2021 సీజన్ని నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు గంగూలీ మాటల్ని బట్టి అర్థమవుతోంది. తాజాగా ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2021 సీజన్ని ఏప్రిల్- మే నెలలో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే.. ఈసారి యూఏఈ వేదికగా కాకుండా.. భారత్లోనే ఈ టోర్నీని నిర్వహిస్తాం. అలానే వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకి కూడా భారత్ ఆతిథ్యమిస్తుంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన రంజీ ట్రోఫీ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్లను తిరిగి ప్రారంభిస్తాం. అన్నింటికీ బయో బబుల్ని క్రియేట్ చేసి సురక్షిత వాతావరణంలో మ్యాచ్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని గంగూలీ వెల్లడించాడు.
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న టీమిండియా.. 14 రోజులు క్వారంటైన్లో ఉండి.. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకూ అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులను ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో సొంతగడ్డపై భారత్ సిరీస్ని ఆడనుంది.