ఐపీఎల్ 2021 సీజన్ రీస్టార్ట్కి మార్గం సుగుమమైంది. ఐపీఎల్ జట్లలో కరోనా కేసులు నమోదవడంతో ఈ నెల 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. తర్జనభర్జనల నడుమ టోర్నీని పునఃప్రారంభించబోతోంది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2021 సీజన్లో 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. టోర్నీ వాయిదాపడే సమయానికి 29 మ్యాచ్లే ముగిశాయి. దాంతో.. మిగిలిన 31 మ్యాచ్లను సెప్టెంబరు 18-19 నుంచి అక్టోబరు 9-10లోపు యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ 2న ఇంగ్లాండ్ గడ్డపైకి వెళ్లనున్న కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడి.. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఢీకొట్టబోతోంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే స్పెషల్ ఛార్టర్ ప్లైట్లో యూఏఈకి భారత క్రికెటర్లు రానున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్ని బయో- సెక్యూర్ బబుల్లో ఉండి ఆడనున్న భారత ఆటగాళ్లు.. ఐపీఎల్ బబుల్లోకి నేరుగా రానున్నారు. అయితే.. మధ్యలో ప్రయాణం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు రోజులు క్వారంటైన్లో ఆటగాళ్లని ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిబంధన ఇంగ్లాండ్ క్రికెటర్లకీ వర్తించనుంది.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్ల్లో.. 20 మ్యాచ్లను 10 రోజుల్లోనే నిర్వహించేలా బీసీసీఐ షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 60 మ్యాచ్లకిగానూ 10 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండేలా బీసీసీఐ తొలుత షెడ్యూల్ ప్రకటించింది. కానీ.. తాజాగా 31 మ్యాచ్ల్లోనే 10 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండబోతున్నాయి. ఇక మిగిలిన ఏడు లీగ్ దశ మ్యాచ్లను వరుసగా నిర్వహించనుండగా.. ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ని రోజు గ్యాప్తో నిర్వహించనున్నారు. సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ని టీమిండియా ఆడాల్సి ఉండగా.. ఐపీఎల్ కారణంగా ఆ సిరీస్ రద్దుకావడం లాంఛనంగా మారింది.
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్ల్లో.. 20 మ్యాచ్లను 10 రోజుల్లోనే నిర్వహించేలా బీసీసీఐ షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 60 మ్యాచ్లకిగానూ 10 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండేలా బీసీసీఐ తొలుత షెడ్యూల్ ప్రకటించింది. కానీ.. తాజాగా 31 మ్యాచ్ల్లోనే 10 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండబోతున్నాయి. ఇక మిగిలిన ఏడు లీగ్ దశ మ్యాచ్లను వరుసగా నిర్వహించనుండగా.. ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ని రోజు గ్యాప్తో నిర్వహించనున్నారు. సెప్టెంబరులో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ని టీమిండియా ఆడాల్సి ఉండగా.. ఐపీఎల్ కారణంగా ఆ సిరీస్ రద్దుకావడం లాంఛనంగా మారింది.