మహేంద్ర సింగ్ సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2023లో గెలిచి లీగ్ చరిత్రలో ఐదో టైటిల్ నెగ్గింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ను సొంత గడ్డపై ఓడించింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ సైతం ట్రోఫీ గెలవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీతో పాటు, సీఎస్కే ఆటగాళ్లు, సమస్త చెన్నై సూపర్ కింగ్స్, ధోనీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా బాణాసంచా కాల్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు సైతం జోరుగా వేడుక చేసుకున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా చిన్న పిల్లల వలె సంబురాలు జరుపుకున్నారు, సంతోషంతో కేరింతలు కొట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ట్రోఫీ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. వాళ్ల పిల్లలు సైతం వారితో కలిసి స్టెప్పులేశారు.
తాము ఐదోసారి కప్పు కొట్టిన విషయాన్ని గుర్తుకుతెచ్చేలా రవీంద్ర జడేజా సహా ఇతర ఆటగాళ్లు పాంచ్ పాంచ్ అంటూ నినాదాలు చేశారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సంబరాలకు సంబంధించిన పూర్తి వీడియోనూ ఆ జట్టు యాజమాన్యం నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోనూ మీరూ చూసేయండి మరి..
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు సైతం జోరుగా వేడుక చేసుకున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా చిన్న పిల్లల వలె సంబురాలు జరుపుకున్నారు, సంతోషంతో కేరింతలు కొట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి ట్రోఫీ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. వాళ్ల పిల్లలు సైతం వారితో కలిసి స్టెప్పులేశారు.
తాము ఐదోసారి కప్పు కొట్టిన విషయాన్ని గుర్తుకుతెచ్చేలా రవీంద్ర జడేజా సహా ఇతర ఆటగాళ్లు పాంచ్ పాంచ్ అంటూ నినాదాలు చేశారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సంబరాలకు సంబంధించిన పూర్తి వీడియోనూ ఆ జట్టు యాజమాన్యం నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోనూ మీరూ చూసేయండి మరి..