యాప్నగరం

Mumbai Indians IPL Auction: ముంబయి గూటికి మళ్లీ లసిత్ మలింగ..!

సుదీర్ఘకాలంగా ముంబయి ఇండియన్స్ జట్టుకే ఆడుతున్న మలింగ‌ని గత ఏడాది వేలంలోకి విడిచిపెట్టిన ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో.. 2018 ఐపీఎల్ సీజన్‌‌ వేలంలో అమ్ముడుపోని క్రికెటర్‌గా ఈ ఫాస్ట్ బౌలర్ నిలిచాడు. కానీ..?

Samayam Telugu 18 Dec 2018, 5:41 pm
శ్రీలంక యార్కర్ల స్టార్ లసిత్ మలింగ మళ్లీ ముంబయి ఇండియన్స్ గూటికి చేరాడు. జైపూర్ వేదికగా ఈరోజు జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ. 2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన లసిత్ మలింగని ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.
Samayam Telugu 300


సుదీర్ఘకాలంగా ముంబయి ఇండియన్స్ జట్టుకే ఆడుతున్న మలింగ‌ని గత ఏడాది వేలంలోకి విడిచిపెట్టిన ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో.. 2018 ఐపీఎల్ సీజన్‌‌ వేలంలో అమ్ముడుపోని క్రికెటర్‌గా ఈ ఫాస్ట్ బౌలర్ నిలిచాడు. కానీ.. సీజన్ ఆరంభానికి ముందే ముంబయి ఫ్రాంఛైజీ తమ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో మలింగ చేర్చుకుంది. తాజాగా.. మళ్లీ జట్టులోకి ఆటగాడిగా అవకాశమిచ్చింది.

పేలవ ఫిటెనెస్ కారణంగా.. కెరీర్‌లో గత ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న లసిత్ మలింగ ఇటీవల మళ్లీ జోరు అందుకున్నాడు. ఎంతలా అంటే.. తుది జట్టులో చోటు కోసం వెంపర్లాడిన అతడ్ని.. ఇప్పుడు ఏకంగా టీమ్ కెప్టెన్‌గా శ్రీలంక సెలక్టర్లు నియమించారు. దీంతో.. ఈ యార్కర్ల స్టార్ కెరీర్ మళ్లీ గాడిలో పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.