ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటములకి ప్రధాన కారణం డేవిడ్ వార్నర్ కెప్టెన్సీనే అని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి ఏడు మ్యాచ్లాడిన హైదరాబాద్.. కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. తుది జట్టు ఎంపిక నుంచి జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మార్పులోనూ డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. సీజన్ మధ్యలో వార్నర్ని కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్రైజర్స్ హైదరాబాద్.. కేన్ విలియమ్సన్కి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. ‘‘ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. నేను అంచనా వేసిన టాప్-4 జట్లలో అదొకటి. కానీ.. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ లోపం కారణంగా.. ఆ జట్టు ప్రదర్శన మరీ తీసికట్టుగా మారింది. బ్యాటింగ్లోనూ అతను మరీ రక్షణాత్మకంగా ఆడాడు. కెప్టెన్సీ మార్పు ద్వారా.. వార్నర్ విషయంలో ఫ్రాంఛైజీ హ్యాపీగా లేదని స్పష్టంగా తెలిసింది. మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాట్స్మెన్లు లేకపోవడం సన్రైజర్స్ బలహీనత. అయినప్పటికీ.. కేదార్ జాదవ్ని రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టాడు. అలాను సుచిత్ని ఓ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడించారు’’ అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో షెడ్యూల్ ప్రకారం 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. జట్లలో కరోనా కేసులు నమోదవడంతో 29 మ్యాచ్లు మాత్రమే సాధ్యమయ్యాయి. మిగిలిన మ్యాచ్ల్ని సెప్టెంబరు- అక్టోబరులో యూఏఈ వేదికగా నిర్వహించడానికి ఉన్న అనువైన మార్గాల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిశీలిస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్లో షెడ్యూల్ ప్రకారం 60 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. జట్లలో కరోనా కేసులు నమోదవడంతో 29 మ్యాచ్లు మాత్రమే సాధ్యమయ్యాయి. మిగిలిన మ్యాచ్ల్ని సెప్టెంబరు- అక్టోబరులో యూఏఈ వేదికగా నిర్వహించడానికి ఉన్న అనువైన మార్గాల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిశీలిస్తోంది.