యాప్నగరం

IPL 2020: KKR టీమ్‌లో అనూహ్య మార్పు

ఐపీఎల్ 2020 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ అనూహ్య మార్పులతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా.. కోచింగ్ స్టాఫ్‌ని వరుసగా ఆ జట్టు ఫ్రాంఛైజీ మార్చేస్తోంది.

Samayam Telugu 10 Feb 2020, 5:49 pm
ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ సుభదీప్‌‌ని బాధ్యతల నుంచి తప్పించి అతని స్థానంలో ఇంగ్లాండ్‌ మాజీ వికెట్ కీపర్ జేమ్స్ పోస్టర్‌‌ని నియమించింది. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా.. గత ఏడాది కనీసం ప్లేఆఫ్‌కి కూడా చేరుకోలేకపోయిన కేకేఆర్ ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తోంది.
Samayam Telugu Kolkata Knight Riders


Read More: వికెట్ ఎక్కడ బుమ్రా..? కంగారులో భారత్
ఇంగ్లాండ్ తరఫున 11 వన్డేలు, 7 టెస్టులు, 5 టీ20 మ్యాచ్‌లాడిన జేమ్స్.. 2018లో క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వాస్తవానికి 2001లో భారత్‌పై టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ వికెట్ కీపర్.. 2009 నుంచి ఇంగ్లాండ్ తరఫున మ్యాచ్‌లు ఆడటం లేదు. రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత కోచ్‌గా మారాడు.


కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌ కోచ్‌గా ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ని నియమించిన కేకేఆర్ ఫ్రాంఛైజీ.. తాజాగా అతనితో కలిసి జేమ్స్ పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఇక చివరిగా 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. చివరి ఐదు సీజన్లలో మూడు సార్లు మాత్రమే ప్లేఆఫ్‌కి చేరింది.

Read More: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.