చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు షాక్ తగిలింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనుందుకు గానూ ఆ జట్టుకు జరిమానా పడింది. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ కెప్టెన్ నితీశ్ రానాకు రూ.24 లక్షలు జరిమానా విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్తో పాటు మిగిలిన ఆటగాళ్లకు కూడా ఫైన్ పడింది. ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే దాన్ని) ఫైన్ విధించారు. ఈ సీజన్లో ఇది వరకే ఓ మ్యాచ్లో కోల్కతా జట్టు స్లో ఓవర్ రేటు నమోదు చేసింది. రెండోసారి కూడా నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేయడంతో జరిమానా పడింది. అంతేకాకుండా చెన్నైతో మ్యాచ్లో చివరి ఓవర్లో కేకేఆర్.. నిబంధనల ప్రకారం 30 యార్డ్స్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే మ్యాచ్ను పూర్తి చేయాల్సి వచ్చింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రతి జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల్లోనే వేయాల్సి ఉంటుంది. మ్యాచ్ మధ్యలో ఉండే రెండు స్ట్రాటజిక్ టైమౌట్లు, డీఆర్ఎస్లు, అంపైర్ రివ్యూలకు పట్టిన సమయానికి అందులో నుండి మినహాయింపు ఉంటుంది. తొలిసారి టైమ్కు ఓవర్లు పూర్తి చేయకపోతే కేవలం కెప్టెన్కు మాత్రమే రూ.12 లక్షలు ఫైన్ విధిస్తారు.
రెండోసారి కూడా జరిగితే కెప్టెన్కు విధించే ఫైన్ను రెట్టింపు చేయడంతో పాటు.. ఆటగాళ్లకు కూడా పెనాల్టీ విధిస్తారు. కెప్టెన్కు రూ.24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచు ఫీజులో 25శాతం (ఏది తక్కువైతే దాన్ని) ఫైన్ విధిస్తారు. మూడోసారి రిపీట్ అయితే మాత్రం.. కెప్టెన్కు రూ.30 లక్షలు జరిమానాతో పాటుగా.. ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. మిగతా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా మ్యాచు ఫీజులో 50 శాతం పెనాల్టీ విధిస్తారు.
ఆదివారం చెన్నైతో మ్యాచులో గెలిచిన కోల్కతా జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే అంతకుముందు మ్యాచులో రాజస్థాన్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం జట్టు నెట్రన్ రేట్పై ప్రతికూల ప్రభావం చూపింది. లీగ్ దశలో భాగంగా కేకేఆర్.. లక్నో సూపర్ జెయింట్స్త తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచులో ఘన విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. కానీ నేరుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించదు. ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తే ముందంజ వేసే అవకాశం ఉంటుంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రతి జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల్లోనే వేయాల్సి ఉంటుంది. మ్యాచ్ మధ్యలో ఉండే రెండు స్ట్రాటజిక్ టైమౌట్లు, డీఆర్ఎస్లు, అంపైర్ రివ్యూలకు పట్టిన సమయానికి అందులో నుండి మినహాయింపు ఉంటుంది. తొలిసారి టైమ్కు ఓవర్లు పూర్తి చేయకపోతే కేవలం కెప్టెన్కు మాత్రమే రూ.12 లక్షలు ఫైన్ విధిస్తారు.
రెండోసారి కూడా జరిగితే కెప్టెన్కు విధించే ఫైన్ను రెట్టింపు చేయడంతో పాటు.. ఆటగాళ్లకు కూడా పెనాల్టీ విధిస్తారు. కెప్టెన్కు రూ.24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా మ్యాచు ఫీజులో 25శాతం (ఏది తక్కువైతే దాన్ని) ఫైన్ విధిస్తారు. మూడోసారి రిపీట్ అయితే మాత్రం.. కెప్టెన్కు రూ.30 లక్షలు జరిమానాతో పాటుగా.. ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. మిగతా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా మ్యాచు ఫీజులో 50 శాతం పెనాల్టీ విధిస్తారు.
ఆదివారం చెన్నైతో మ్యాచులో గెలిచిన కోల్కతా జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే అంతకుముందు మ్యాచులో రాజస్థాన్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం జట్టు నెట్రన్ రేట్పై ప్రతికూల ప్రభావం చూపింది. లీగ్ దశలో భాగంగా కేకేఆర్.. లక్నో సూపర్ జెయింట్స్త తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచులో ఘన విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. కానీ నేరుగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించదు. ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తే ముందంజ వేసే అవకాశం ఉంటుంది.