యాప్నగరం

కోల్‌కతాని చిత్తుగా ఓడించిన పంజాబ్

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన

Samayam Telugu 21 Apr 2018, 8:36 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు క్రిస్‌గేల్ (62 నాటౌట్: 38 బంతుల్లో 5x4, 6x6), కేఎల్ రాహుల్ (60: 27 బంతుల్లో 9x4, 2x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 96/0తో నిలిచిన దశలో వర్షం రావడంతో దాదాపు గంట మ్యాచ్ సమయం వేస్ట్ అయ్యింది. దీంతో.. మ్యాచ్‌ని 13 ఓవర్లకి కుదించిన అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్‌ని 125 పరుగులుగా నిర్ణయించారు. అప్పటికే జోరుమీదున్న క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ భారీ సిక్సర్లతో మ్యాచ్‌ని కొనసాగించారు. అర్ధశతకం అనంతరం కేఎల్ రాహుల్ ఔటైనా.. గెలుపు లాంఛనాన్ని మయాంక్ అగర్వాల్(2)తో కలిసి క్రిస్‌గేల్ 11.1 ఓవర్లోనే పూర్తి చేశాడు.
Samayam Telugu KXIP OP


అంతకముందు ఓపెనర్ క్రిస్‌లిన్ (74: 41 బంతుల్లో 6x4, 4x6), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (43: 28 బంతుల్లో 6x4), రాబిన్ ఉతప్ప (34: 23 బంతుల్లో 5x4, 1x6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.