ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కి పేలవ ఆరంభం లభించింది. కోల్కతా నైట్రైడర్స్తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో.. 10 పరుగుల తేడాతో ఆ జట్టు చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. మొదట నితీశ్ రాణా (80: 56 బంతుల్లో 9x4, 4x6), రాహుల్ త్రిపాఠి (53: 29 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదడంతో కోల్కతా నైట్రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో మనీశ్ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2x4, 3x6), జానీ బెయిర్స్టో (55: 40 బంతుల్లో 5x4, 3x6) అర్ధశతకాలు నమోదు చేసినా.. చివర్లో వరుసగా వికెట్లు చేజార్చుకున్న హైదరాబాద్ 177/5కే పరిమితమైంది.
వాస్తవానికి 188 పరుగుల లక్ష్యఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్కి మెరుగైన ఆరంభం లభించలేదు. ప్రయోగాత్మక ఓపెనర్ సాహా (7), కెప్టెన్ డేవిడ్ వార్నర్ (3) మూడు ఓవర్లలోపే ఔటైపోవడంతో హైదరాబాద్ 10/2తో కష్టాల్లో పడింది. కానీ.. తనదైన శైలిలో హిట్టింగ్ చేసిన జానీ బెయిర్స్టో.. మూడో వికెట్కి మనీశ్ పాండేతో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. మళ్లీ మ్యాచ్లోకి హైదరాబాద్ వచ్చింది. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న జానీ బెయిర్స్టోని టీమ్ స్కోరు 102 వద్ద ఔట్ చేసిన పాట్ కమిన్స్.. మ్యాచ్ని మలుపు తిప్పాడు.
బెయిర్స్టో ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ నబీ (14: 11 బంతుల్లో 2x4), విజయ్ శంకర్ (11: 7 బంతుల్లో 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటవగా.. చివర్లో మనీశ్ పాండే గేర్ మార్చలేకపోయాడు. అయితే.. చివరి 12 బంతుల్లో హైదరాబాద్ విజయానికి 38 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ (19 నాటౌట్: 8 బంతుల్లో 2x6).. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో.. ఆ ఓవర్లో హైదరాబాద్ 16 పరుగులు పిండుకోవడంతో.. సమీకరణం 6 బంతుల్లో 22 పరుగులుగా మారిపోయింది. కానీ.. చివరి ఓవర్ వేసిన ఆండ్రీ రసెల్ తెలివిగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇవ్వడంతో హైదరాబాద్కి 10 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అంతకముందు 18వ ఓవర్లోనూ విజయ్ శంకర్ వికెట్ పడగొట్టిన రసెల్.. ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.
మ్యాచ్లో అంతకముందు టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. శుభమన్ గిల్ (15: 13 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి కోల్కతా ఇన్నింగ్స్ని ప్రారంభించిన నితీశ్ రాణా మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్కి 7 ఓవర్లలో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాణా.. రెండో వికెట్కి రాహుల్ త్రిపాఠితో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. కోల్కతా నైట్రైడర్స్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది.
కానీ.. టీమ్ స్కోరు 146 వద్ద రాహుల్ త్రిపాఠి ఔటవగా.. అనంతరం వచ్చిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ (5: 5 బంతుల్లో 1x4) అంచనాల్ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ.. టీమ్ స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న నితీశ్ రాణా.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ సెంచరీ మార్క్ని చేరుకునేలా కనిపించాడు. కానీ.. మహ్మద్ నబీ ఒకే ఓవర్లో వరుసగా నితీశ్ రాణా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2: 3 బంతుల్లో)ని ఔట్ చేశాడు. అయితే.. చివర్లో దినేశ్ కార్తీక్ (22 నాటౌట్: 9 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించడంతో కోల్కతా 187 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వరుసగా 6, 4 బాదిన దినేశ్ కార్తీక్.. ఆ ఓవర్లో 16 పరుగులు పిండుకున్నాడు.
వాస్తవానికి 188 పరుగుల లక్ష్యఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్కి మెరుగైన ఆరంభం లభించలేదు. ప్రయోగాత్మక ఓపెనర్ సాహా (7), కెప్టెన్ డేవిడ్ వార్నర్ (3) మూడు ఓవర్లలోపే ఔటైపోవడంతో హైదరాబాద్ 10/2తో కష్టాల్లో పడింది. కానీ.. తనదైన శైలిలో హిట్టింగ్ చేసిన జానీ బెయిర్స్టో.. మూడో వికెట్కి మనీశ్ పాండేతో కలిసి 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. మళ్లీ మ్యాచ్లోకి హైదరాబాద్ వచ్చింది. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న జానీ బెయిర్స్టోని టీమ్ స్కోరు 102 వద్ద ఔట్ చేసిన పాట్ కమిన్స్.. మ్యాచ్ని మలుపు తిప్పాడు.
బెయిర్స్టో ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ నబీ (14: 11 బంతుల్లో 2x4), విజయ్ శంకర్ (11: 7 బంతుల్లో 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటవగా.. చివర్లో మనీశ్ పాండే గేర్ మార్చలేకపోయాడు. అయితే.. చివరి 12 బంతుల్లో హైదరాబాద్ విజయానికి 38 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్ (19 నాటౌట్: 8 బంతుల్లో 2x6).. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో.. ఆ ఓవర్లో హైదరాబాద్ 16 పరుగులు పిండుకోవడంతో.. సమీకరణం 6 బంతుల్లో 22 పరుగులుగా మారిపోయింది. కానీ.. చివరి ఓవర్ వేసిన ఆండ్రీ రసెల్ తెలివిగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇవ్వడంతో హైదరాబాద్కి 10 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అంతకముందు 18వ ఓవర్లోనూ విజయ్ శంకర్ వికెట్ పడగొట్టిన రసెల్.. ఆరు పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.
మ్యాచ్లో అంతకముందు టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. శుభమన్ గిల్ (15: 13 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి కోల్కతా ఇన్నింగ్స్ని ప్రారంభించిన నితీశ్ రాణా మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్కి 7 ఓవర్లలో 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాణా.. రెండో వికెట్కి రాహుల్ త్రిపాఠితో కలిసి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. కోల్కతా నైట్రైడర్స్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది.
కానీ.. టీమ్ స్కోరు 146 వద్ద రాహుల్ త్రిపాఠి ఔటవగా.. అనంతరం వచ్చిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ (5: 5 బంతుల్లో 1x4) అంచనాల్ని అందుకోలేకపోయాడు. అయినప్పటికీ.. టీమ్ స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న నితీశ్ రాణా.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ సెంచరీ మార్క్ని చేరుకునేలా కనిపించాడు. కానీ.. మహ్మద్ నబీ ఒకే ఓవర్లో వరుసగా నితీశ్ రాణా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2: 3 బంతుల్లో)ని ఔట్ చేశాడు. అయితే.. చివర్లో దినేశ్ కార్తీక్ (22 నాటౌట్: 9 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించడంతో కోల్కతా 187 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వరుసగా 6, 4 బాదిన దినేశ్ కార్తీక్.. ఆ ఓవర్లో 16 పరుగులు పిండుకున్నాడు.