ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) టీమ్ 127 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్ (43: 39 బంతుల్లో 5x4, 1x6), ఆండ్రీ రసెల్ (38 నాటౌట్: 31 బంతుల్లో 1x4, 4x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముకేష్ కుమార్ ఒక వికెట్ తీశాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ టీమ్కి పవర్ ప్లేలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ లిట్టన్ దాస్ (4), వెంకటేశ్ అయ్యర్ (0), కెప్టెన్ నితీశ్ రాణా (4) ఆరంభంలోనే ఔటైపోయారు. అనంతరం వచ్చిన మన్దీప్ సింగ్ (12), రింకు సింగ్ (6), సునీల్ నరైన్ (4) కూడా ఢిల్లీ బౌలర్లకి ఎదురు నిలవలేకపోయారు. కానీ.. ఫస్ట్ నుంచి ఓపెనర్ జేసన్ రాయ్ మాత్రం సమయోచితంగా ఆడుతూ 15వ ఓవర్ వరకూ తన వికెట్ని కాపాడుకున్నాడు.
టీమ్ స్కోరు 93 వద్ద జేసన్ రాయ్ 7వ వికెట్ రూపంలో ఔటైపోగా.. ఇక అక్కడి నుంచి ఆండ్రీ రసెల్ బాధ్యత తీసుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనుకుల్ రాయ్ (0), ఉమేశ్ యాదవ్ (3), వరుణ్ చక్రవర్తి (1) నుంచి లభించిన కాస్త సపోర్ట్తోనే కోల్కతా టీమ్ స్కోరుని 100 దాటించాడు. కానీ.. లాస్ట్ ఓవర్ వరకూ గేర్ మార్చలేకపోయాడు. చివరి ఓవర్ వేసిన ముకేష్ కుమార్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన రసెల్ మొత్తం 19 పరుగులు రాబట్టాడు. దాంతో కోల్కతా కనీసం 127 పరుగులైనా చేయగలిగింది.
టీమ్ స్కోరు 93 వద్ద జేసన్ రాయ్ 7వ వికెట్ రూపంలో ఔటైపోగా.. ఇక అక్కడి నుంచి ఆండ్రీ రసెల్ బాధ్యత తీసుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనుకుల్ రాయ్ (0), ఉమేశ్ యాదవ్ (3), వరుణ్ చక్రవర్తి (1) నుంచి లభించిన కాస్త సపోర్ట్తోనే కోల్కతా టీమ్ స్కోరుని 100 దాటించాడు. కానీ.. లాస్ట్ ఓవర్ వరకూ గేర్ మార్చలేకపోయాడు. చివరి ఓవర్ వేసిన ముకేష్ కుమార్ బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టిన రసెల్ మొత్తం 19 పరుగులు రాబట్టాడు. దాంతో కోల్కతా కనీసం 127 పరుగులైనా చేయగలిగింది.