యాప్నగరం

సన్‌రైజర్స్‌పై విజయాన్ని క్రికెటర్ మన్‌‌దీప్ తండ్రికి అంకితమిచ్చిన పంజాబ్!

Sunrisers Hyderabadతో మ్యాచ్‌లో అద్భుతంగా గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... తమ విజయాన్ని క్రికెటర్ మన్‌దీప్ సింగ్ తండ్రికి అంకితమిచ్చింది.

Samayam Telugu 25 Oct 2020, 12:39 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. ఈ విజయాన్ని మన్‌దీప్ సింగ్ తండ్రికి అంకితమిచ్చింది. మ్యాచ్ ముందు రోజు రాత్రి మన్‌దీప్ సింగ్ తండ్రి మరణించారు. తనను ఇంతటి వాణ్ని చేసిన తండ్రి చనిపోయిన బాధను దిగమింగుతూనే.. మనదీప్ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో బరిలో దిగాడు.
Samayam Telugu mandeep singh | Image: Twitter


మన్‌దీప్ తండ్రి ఆరోగ్యం గత కొంత కాలంగా బాగోలేదు. గత వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. శుక్రవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో మన్‌దీప్ తండ్రి మరణానికి సంతాప సూచికగా.. పంజాబ్ ఆటగాళ్లు చేతికి నల్లటి రిబ్బన్లు కట్టుకొని మ్యాచ్‌లో బరిలోకి దిగారు.

ఈ మ్యాచ్‌‌కు మయాంక్ అగర్వాల్ దూరం కావడంతో.. అతడి స్థానంలో ఓపెనర్‌గా ఆడిన మన్‌దీప్ 14 బంతుల్లో 17 రన్స్ చేసి.. తొలి వికెట్‌కు రాహుల్‌తో కలిసి 37 రన్స్ జోడించాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ 126 పరుగులకే పరిమితమైనప్పటికీ.. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో 14 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కూల్చి.. పంజాబ్‌కు ఊహించని విజయాన్ని కట్టబెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.