యాప్నగరం

ఐపీఎల్‌‌లో మయాంక్ అగర్వాల్ మెరుపు శతకం

ఐపీఎల్ 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు వరుస శతకాలు బాదేశారు. గత గురువారం పంజాబ్ కెప్టెన్ రాహుల్ సెంచరీ నమోదు చేయగా.. ఆదివారం రాత్రి మరో ఓపెనర్ మయాంక్ కెరీర్‌లో తొలి ఐపీఎల్ శతకాన్ని అందుకున్నాడు.

Samayam Telugu 27 Sep 2020, 9:02 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో రెండో శతకం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్‌తో షార్జా వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (106: 50 బంతుల్లో 10x4, 7x6) సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కేఎల్ రాహుల్‌ (69 : 54 బంతుల్లో 7x4, 1x6)తో కలిసి పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మయాంక్ అగర్వాల్ ఆరంభం నుంచే హిట్టింగ్‌తో అదరగొట్టేశాడు. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మయాంక్‌కి ఇది తొలి శతకంకాగా.. గత గురువారం పంజాబ్ కెప్టెన్ రాహుల్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
Samayam Telugu Mayank Agarwal (Image Credit: IPL/Twitter)



మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడినా.. గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ పంజాబ్ ఇన్నింగ్స్‌ని నడిపించిన మయాంక్ అగర్వాల్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ నుంచి టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. ఆ ఓవర్‌లో వరుసగా 6, 6, 4 బాదిన మయాంక్.. ఆ తర్వాత ఓవర్ వేసిన శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లోనూ రెండు సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో కేవలం 45 బంతుల్లో సెంచరీ మార్క్‌ని అందుకున్న మయాంక్ అగర్వాల్.. కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కి 16.3 ఓవర్లలో ఏకంగా 183 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మయాంక్ ఔటైన తర్వాత ఓవర్‌లో రాహుల్ కూడా ఔటైపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.