ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్లో రికార్డు స్కోరు నమోదైంది. పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మొహాలి వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) టీమ్ 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల రికార్డ్ స్కోరు నమోదు చేసింది. ఆ జట్టులో మార్కస్ స్టాయినిస్ (72: 40 బంతుల్లో 6x4, 5x6), కైల్ మేయర్స్ (54: 24 బంతుల్లో 7x4, 4x6), నికోలస్ పూరన్ (45: 19 బంతుల్లో 7x4, 1x6), ఆయుష్ బదోని (43: 24 బంతుల్లో 3x4, 3x6) విధ్వంసకర రీతిలో హిట్టింగ్ చేసేశారు. ఈ నలుగురి దెబ్బకి పంజాబ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే కగిసో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్, శామ్ కరన్, లివింగ్ స్టోన్ తలో వికెట్ తీశారు. మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో కైల్ మేయర్స్తో కలిసి లక్నో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన కేఎల్ రాహుల్ (12: 9 బంతుల్లో 1x4, 1x6) ఫస్ట్లోనే ఔటైపోయాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన బదోనితో కలిసి కైల్ మేయర్స్ సిక్సర్ల మోత మోగించేశాడు. అయితే మేయర్స్ని రబాడ ఔట్ చేయగా.. బదోనీని లివింగ్స్టోన్ బోల్తా కొట్టించాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన స్టాయినిస్ మరింత ప్రమాదకరంగా హిట్టింగ్ చేశాడు. అతనికి జోడీగా స్లాగ్ ఓవర్లలో నికోలస్ పూరన్ కూడా బౌండరీల మోత మోగించేయడంతో లక్నో టీమ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. 2013లో పుణె వారియర్స్పై అప్పట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 263 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈరోజు లక్నో టీమ్ చేసిన 257 పరుగులే అత్యధికం. మళ్లీ మూడో స్థానంలో బెంగళూరు టీమ్ 248 పరుగులతో ఉంది. 2016లో గుజరాత్ లయన్స్పై ఆర్సీబీ ఈ స్కోరు చేసింది.
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. 2013లో పుణె వారియర్స్పై అప్పట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 263 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈరోజు లక్నో టీమ్ చేసిన 257 పరుగులే అత్యధికం. మళ్లీ మూడో స్థానంలో బెంగళూరు టీమ్ 248 పరుగులతో ఉంది. 2016లో గుజరాత్ లయన్స్పై ఆర్సీబీ ఈ స్కోరు చేసింది.