ఐపీఎల్ 2020 ఫైనల్లో తమ కెప్టెన్ వికెట్ కాపాడటం కోసం సూర్యకుమార్ యాదవ్ తన వికెట్ను త్యాగం చేశాడు. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న సూర్య.. రోహిత్ను కాపాడుకోవడం కోసం తను రనౌటయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్కు దిగింది. ముంబై బౌలర్లు ఆరంభంలోనే చెలరేగడంతో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ పంత్ (56), శ్రేయస్ అయ్యర్ (65) నాలుగో వికెట్కు 96 రన్స్ జోడించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది.
157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కు కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ (12 బంతుల్లో 20) శుభారంభం ఇచ్చారు. డికాక్ను స్టోయినిస్ పెవిలియన్ చేర్చినా.. రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్.. ఫైనల్లో మాత్రం స్వేచ్ఛగా షాట్లు ఆడాడు.
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రోహిత్ అనవసర పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్యకుమార్ యాదవ్ వారిస్తున్నా.. లేని పరుగు కోసం నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ ఒకే వైపు క్రీజ్లోకి రాగా.. ఫీల్డర్ ప్రవీణ్ దూబే బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైపు విసిరాడు. ఇద్దరిలో ఒకరు రనౌట్ కావడం తప్పదని గ్రహించాక.. సూర్య (19) తన వికెట్ త్యాగం చేశాడు.
క్రీజ్లో నుంచి బయటకు వచ్చి స్ట్రైకర్ ఎండ్ వైపు అడుగులు వేసి.. అనంతరం పెవిలియన్ వైపు నడక సాగించాడు. హాఫ్ సెంచరీ ముంగిట ఉన్న కెప్టెన్ కోసం తను రనౌటయినప్పటికీ.. సూర్య ఎలాంటి ఉద్వేగం లేదా అసహనం కనిపించనీయలేదు. కానీ తన కారణంగా ఫామ్లో ఉన్న సూర్య తన వికెట్ను త్యాగం చేయడం రోహిత్ను తీవ్రంగా కలచివేసింది.
రబాడ వేసిన తర్వాతి ఓవర్లో ఫోర్ బాదిన రోహిత్ ఈ సీజన్లో మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్ ఫైనల్లో రెండుసార్లు హాఫ్ సెంచరీలు చేసిన తొలి కెప్టెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2015లో కోల్కతాలో చెన్నై సూపర్ కింగ్స్పైనా రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 69 రన్స్ చేసిన రోహిత్ ముంబై విజయానికి చేరువయ్యాక నోర్జే బౌలింగ్లో ఔటయ్యాడు. మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో ముంబై ఈ మ్యాచ్లో నెగ్గి.. వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ముంబై ఐపీఎల్ టైటిల్ గెలవడం ఇది ఐదోసారి కావడం విశేషం.
మ్యాచ్ అనంతరం రనౌటైన విషయమై సూర్య మాట్లాడుతూ.. రోహిత్ మంచి టచ్లో ఉన్నాడని.. ఈ మ్యాచ్లో యాంకర్ రోల్ పోషిస్తున్నాడని.. అందుకే తన వికెట్ త్యాగం చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించానని తెలిపాడు.
157 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కు కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్ (12 బంతుల్లో 20) శుభారంభం ఇచ్చారు. డికాక్ను స్టోయినిస్ పెవిలియన్ చేర్చినా.. రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన రోహిత్.. ఫైనల్లో మాత్రం స్వేచ్ఛగా షాట్లు ఆడాడు.
అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ పదకొండో ఓవర్లో రోహిత్ అనవసర పరుగు కోసం ప్రయత్నించాడు. సూర్యకుమార్ యాదవ్ వారిస్తున్నా.. లేని పరుగు కోసం నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ ఒకే వైపు క్రీజ్లోకి రాగా.. ఫీల్డర్ ప్రవీణ్ దూబే బంతిని వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైపు విసిరాడు. ఇద్దరిలో ఒకరు రనౌట్ కావడం తప్పదని గ్రహించాక.. సూర్య (19) తన వికెట్ త్యాగం చేశాడు.