యాప్నగరం

CSK vs RR Trolls: ఏంటి ధోనీ ప్లాన్ బెడిసికొట్టిందా..? ఊహించలేదు కదూ..!

మ్యాచ్ గమనానికి అనుగుణంగా వ్యూహాల్ని రచించడంలో ధోనీకి తిరుగులేదు. కానీ.. రాజస్థాన్ హిట్టర్లు వరుస సిక్సర్లతో చెలరేగిపోతుంటే కెప్టెన్‌గా ధోనీ ఏం చేయలేకపోయాడు. దాంతో.. ఆ జట్టు భారీ స్కోరు నమోదు చేయగలిగింది.

Samayam Telugu 23 Sep 2020, 8:21 am
ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి రెండో మ్యాచ్‌లోనే ఊహించని ఎదురుదెబ్బ తగలింది. షార్జా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్లని ఉతికారేసిన రాజస్థాన్ రాయల్స్ 216 పరుగులు చేయడమేకాకుండా.. ఆ తర్వాత ఛేదనకు దిగిన చెన్నై‌ని 200/6కే పరిమితం చేయగలిగింది. వాస్తవానికి రాజస్థాన్ జట్టులో బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్ లాంటి స్టార్ క్రికెటర్లు ఈ మ్యాచ్‌కి లేకపోవడంతో చెన్నై అలవోక విజయం సాధిస్తుందని అంతా అంచనాలు వేశారు. కానీ.. సంజు శాంసన్ (74: 32 బంతుల్లో 1x4, 9x6), స్టీవ్‌స్మిత్ (69: 47 బంతుల్లో 4x4, 4x6), జోప్రా ఆర్చర్ (27 నాటౌట్: 8 బంతుల్లో 4x6) చెలరేగిపోవడంతో చెన్నై బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా.. పీయూస్ చావ్లా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శాంసన్ వరుస సిక్సర్లు బాదుతున్నా.. ధోనీ కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. దాంతో.. ఫ్యాన్స్‌ సెటైరికల్‌గా స్పందిస్తున్నారు.
Samayam Telugu CSK vs RR Trolls (Image Credit: Twitter)


Read More: CSK vs RR Highlights: షార్జాలో సిక్సర్ల వర్షం.. చెన్నై ఓటమికి కారణాలివే!

217 పరుగుల ఛేదనకి ప్లాన్ చేయడంలోనూ ధోనీ విఫలమయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌కి రాకుండా శామ్ కరన్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువ క్రికెటర్లని ధోనీ ముందుకు పంపగా.. ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ క్రీజు వెలుపలికి వెళ్లి సిక్స్ కొట్టబోయి స్టంపౌటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ కూడా నిరాశపరచగా.. క్రీజులోకి వచ్చిన ధోనీ.. చివరి ఓవర్ వరకూ బ్యాట్ ఝళిపించలేదు. ఆఖరి 4 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ వరుసగా 3 సిక్సర్లు బాదినా ప్రయోజనం లేకపోయింది. ఒకవేళ అదే హిట్టింగ్ ధోనీ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి చేసుంటే..? మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read More:undefined

దుబాయ్, అబుదాబి స్టేడియాలతో పోలిస్తే షార్జా స్టేడియం చిన్నది కావడంతో రాజస్థాన్, చెన్నై బ్యాట్స్‌మెన్‌లు వరుస సిక్సర్లతో చెలరేగిపోయారు. మ్యాచ్‌లో మొత్తం 33 సిక్సర్లు నమోదవగా.. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ మ్యాచ్‌లో 33 సిక్సర్లు నమోదవడం ఇది రెండో సారి మాత్రమే. ధోనీ కొట్టిన ఓ సిక్స్ అయితే స్టేడియం వెలుపల రోడ్డుపై పడిపోగా.. శాంసన్, వాట్సన్ కూడా కొన్ని బంతుల్ని స్టేడియం పైకప్పులపైకి కొట్టారు. దాంతో.. ఫీల్డ్ అంపైర్లు పదే పదే బాల్స్‌ని మైదానంలోకి తెప్పించాల్సి వచ్చింది.


చెన్నై బౌలర్ లుంగి ఎంగిడి వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో జోప్రా ఆర్చర్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదేయగా.. మొత్తంగా 6, 6, N6, N6, Wd, 0, 1,1, 1 రూపంలో 30 పరుగుల్ని రాజస్థాన్ రాయల్స్ పిండుకుంది. ఆర్చర్ నుంచి ఈ తరహాలో హిట్టింగ్‌ని ఎవరూ ఊహించలేదు. ధోనీ సైతం ఆర్చర్ దూకుడుకి ఆశ్చర్యపోతున్నట్లు కనిపించాడు. డీఆర్‌ఎస్ కోరడంలోనూ ధోనీ ఒకసారి ఫెయిలవగా.. ధోనీ రివ్వ్యూ సిస్టమ్ సర్వర్ డౌన్ అంటూ జోక్‌లు పేలుస్తున్నారు.



















తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.