ఐపీఎల్ వేలం రెండో రోజున హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ రూ.1.70 కోట్లకు అమ్ముడుపోయాడు. రూ.20 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఆరంభ బిడ్ దాఖలు చేయగా.. ఢిల్లీ పోటీపడింది. రూ.60 లక్షల వరకు సన్రైజర్స్ బిడ్లో పాల్గొంది. ఇక తిలక్ వర్మను ఢిల్లీ దక్కించుకుంటుందని అందరూ భావిస్తున్న దశలో చెన్నై సూపర్ కింగ్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. కాసేపటికే ముంబై ఇండియన్స్ కూడా రంగంలోకి దిగింది.
చెన్నై, ముంబై పోటాపోటీగా బిడ్డింగ్లో పాల్గొనడంతో.. తిలక్ వర్మ ధర కోటిన్నర దాటింది. చివరకు ముంబై ఇండియన్స్ అతణ్ని రూ.1.70 కోట్లకు దక్కించుకుంది. టీమిండియా అండర్-19 క్రికెటర్ అయిన తిలక్ వర్మ.. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ అయిన యశ్ ధుల్ కంటే ఎక్కువ ధర పలకడం గమనార్హం.
హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ.. 2018-19 రంజీ సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2019 ఫిబ్రవరి 28న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోకి అడుగుపెట్టడం ద్వారా టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది సెప్టెంబర్ 28న విజయ్ హజారే ట్రోఫీ ఆడటం ద్వారా లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
చెన్నై, ముంబై పోటాపోటీగా బిడ్డింగ్లో పాల్గొనడంతో.. తిలక్ వర్మ ధర కోటిన్నర దాటింది. చివరకు ముంబై ఇండియన్స్ అతణ్ని రూ.1.70 కోట్లకు దక్కించుకుంది. టీమిండియా అండర్-19 క్రికెటర్ అయిన తిలక్ వర్మ.. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ అయిన యశ్ ధుల్ కంటే ఎక్కువ ధర పలకడం గమనార్హం.
హైదరాబాద్కు చెందిన తిలక్ వర్మ.. 2018-19 రంజీ సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2019 ఫిబ్రవరి 28న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోకి అడుగుపెట్టడం ద్వారా టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది సెప్టెంబర్ 28న విజయ్ హజారే ట్రోఫీ ఆడటం ద్వారా లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.