యాప్నగరం

‘సెహ్వాగ్ చూశావా..? సన్‌రైజర్స్ సత్తా ఇది’.. వీరూకు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ చురకలు

Sunrisers Hyderabad 201 పరుగులు చేశాక ఫ్యాన్స్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వగ్‌కు చురకలు అంటిస్తున్నారు. వీరూ చూడూ.. ఇది సన్‌రైజర్స్ సత్తా అంటూ మాజీ క్రికెటర్‌కు ట్వీట్లు చేస్తున్నారు.

Samayam Telugu 9 Oct 2020, 2:58 pm
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 201 రన్స్ చేసిన సన్‌రైజర్స్.. 69 రన్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (52), జానీ బెయిర్‌స్టో (97) తొలి వికెట్‌కు 15 ఓవర్లలోనే 160 పరుగులు జోడించారు. ఈ సీజన్లో తొలిసారి ఆరెంజ్ ఆర్మీ 200 మార్క్ దాటగానే.. ఫ్యాన్స్ మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌పై దాడి మొదలుపెట్టారు.
Samayam Telugu viru srh | Image: BCCI


ఓపెనర్లు శుభారంభం అందించలేకపోతే.. సన్‌రైజర్స్‌ మిడిలార్డర్ ఆ లోటును భర్తీ చేయలేపోతోంది. ఓపెనర్లు ఔటయ్యాక వెంట వెంటనే వికెట్లను కోల్పోయి.. బెంగళూరుతో గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూసింది. దీంతో షార్జాలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు వీరేంద్ర సెహ్వాగ్ సన్‌రైజర్స్‌ను అవమానించేలా మాట్లాడాడు.
ముంబై చేతిలో సన్‌రైజర్స్ చిత్తవుతుందని.. 200-250 రన్స్ చేసే దమ్ము ఆ జట్టుకు లేదని సెహ్వాగ్ నోరు జారాడు. షార్జాలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై తేలిగ్గా గెలుస్తుందన్నాడు. సన్‌రైజర్స్ జట్టు కేవలం 150 పరుగులు మాత్రమే చేయగలదని.. ముంబై ముందుగా బ్యాటింగ్ చేస్తే 200కిపైగా రన్స్ చేస్తుందని సెహ్వాగ్ చెప్పాడు.

ఆ మ్యాచ్‌లో ముంబై 208 రన్స్ చేయగా.. హైదరాబాద్ 174 రన్స్ చేసింది. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లే 160 రన్స్ చేసి అదరగొట్టారు. దీంతో సన్‌రైజర్స్ 200కిపైగా రన్స్ చేసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్.. వీరూకి కొద్ది రోజుల క్రితం అతడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ను తక్కువగా అంచనా వేయొద్దని హితవు పలుకుతున్నారు. ‘సెహ్వాగ్.. చిన్న స్టేడియమైన షార్జాలో కాదు.. మా సన్‌రైజర్స్ దుబాయ్‌లో 200 రన్స్ చేసింది.. మా జట్టును తక్కువగా అంచనా వేయకూ’ అంటూ వీరూకు కౌంటర్లు ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.